Webdunia - Bharat's app for daily news and videos

Install App

40 ఏళ్లొచ్చినా మొటిమలు వదలడంలేదా? లవంగం వైద్యంతో ఫటాఫట్

మనం ప్రతి రోజు వంటకాలలో రకరకాల సుగంధ ద్రవ్యాలను రుచి కోసం, వాసన కోసం వాడుతుంటాము. ఇవి రుచికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా లవంగం మన శరీరానికి చక్కటి ఔషధంగా పనిచేస్తుంది. అది ఎలాగో తెలుసుకుందాం.

Webdunia
శుక్రవారం, 17 ఆగస్టు 2018 (14:17 IST)
మనం ప్రతి రోజు వంటకాలలో రకరకాల సుగంధ ద్రవ్యాలను రుచి కోసం, వాసన కోసం వాడుతుంటాము. ఇవి రుచికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా లవంగం మన శరీరానికి చక్కటి ఔషధంగా పనిచేస్తుంది. అది ఎలాగో తెలుసుకుందాం.
 
1. మన శారీరక, మానసిక దోషాలను సమన్వయపరచి సమస్థితిలో ఉంచి శుభప్రదంగా, ఆరోగ్యప్రదంగా, ఐశ్వర్యప్రదంగా, మోక్షప్రదంగా ఉపకరించే పరమపవిత్రమైన అత్యంత శక్తివంతమైన స్వామివార్ల తీర్ధాన్ని తయారుచేయటానికి లవంగాలు ప్రముఖపాత్ర వహిస్తాయి.
 
2. 5 మి.లీ. నువ్వుల నూనెలో ఒక లవంగాన్ని నలగ్గొట్టి వేసి వెచ్చజేసి చల్లార్చిన నూనెను రెండుమూడు చుక్కలు చెవిలో వేసుకుంటే చెవి పోటు తగ్గుతుంది. లవంగాలు దాల్చిన చెక్క, పసుపు, జాపత్రి చూర్ణాలను ఒక్కొక్కటి 10 గ్రా చొప్పున కలిపి ఉంచుకొని రోజు రెండు పూటలా పూటకు 4,5 చిటికెల పొడిని తగినంత తేనెతో కలిపి సేవిస్తుంటే ముక్కు నుంచి నీళ్లు కారటం, తుమ్ములు, ముక్కు, కళ్లు దురదలుపెట్టడం, జలుబు వంటి సమస్యలు తగ్గిపోతాయి.
 
3. లవంగాల చూర్ణానికి సమానంగా నల్లజీలకర్ర చూర్ణాన్ని కలిపి ఉంచుకొని రోజు ఒకసారి తగినంత పొడిలో నీరు కలిపి పేస్టులా చేసి ముఖానికి పలుచగా పట్టించి అరగంట ఆగి గోరువెచ్చని నీటితో కడుక్కుంటుంటే వేధించే మెుటిమల సమస్య తగ్గిపోతుంది.
 
4. లవంగ నూనెలో తడిపిన దూదిని పిప్పి పంటిపై ఉంచితే తక్షణమే నొప్పితగ్గిపోతుంది.
 
5. లవంగాల చూర్ణం, మిరియాల చూర్ణాలను పది గ్రాముల చొప్పున కలిపి ఉంచుకొని ఉదయం, రాత్రి పూట 4,5 చిటికెల పొడిని  పావు టీ స్పూన్ నెయ్యి, అర టీ స్పూన్ తేనె కలిపి సేవిస్తుంటే శ్లేష్మం తెగి పడిపోతుంది. గొంతులో గురగుర తగ్గిపోతుంది. దగ్గు, ఆయాసం నెమ్మదిస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వామ్మో.. వరంగల్ తహసీల్దార్ బండి నాగేశ్వరరావు ఆస్తులు విలువెంతంటే?

Chandrayaan-5: చంద్రయాన్-5 కోసం కుదిరిన డీల్.. జపాన్‌తో కలిసి పనిచేస్తాం.. నరేంద్ర మోదీ

తెలుగు భాష, సంస్కృతిని పరిరక్షించడానికి సంకీర్ణ ప్రభుత్వం కట్టుబడి వుంది.. కందుల దుర్గేష్

సెక్యూరిటీ గార్డు వేతనం నెలకు రూ.10 వేలు.. రూ.3.14 కోట్లకు జీఎస్టీ నోటీసు

గోదావరి నదికి చేరుతున్న వరద నీరు.. ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరిక

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nag: నాగార్జున 100వ చిత్రం, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన నాగ చైతన్య టీమ్

పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన మైథలాజికల్ థ్రిల్లర్ మయూఖం

గ్రాండ్ పేరెంట్స్‌‌కి ఉచితంగా ప్రదర్శించనున్న త్రిబాణధారి బార్బరిక్ టీం

రోషన్ కనకాల.. మోగ్లీ గ్లింప్స్ లాంచ్ చేసిన రామ్ చరణ్.. నాని వాయిస్ ఓవర్

బాహుబలి తర్వాత కుటుంబంతో చూసేలా లిటిల్ హార్ట్స్ - ఆదిత్య హాసన్, సాయి కృష్ణ

తర్వాతి కథనం
Show comments