Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒత్తిడిని తగ్గించే ఆహార పదార్థాలు ఏంటి?

Webdunia
సోమవారం, 8 మే 2023 (14:59 IST)
సాధారణంగా ఇపుడు ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ ఒత్తిడిని తగ్గించుకోవటానికి పౌష్టికాహార నిపుణులు కొన్ని రకాల ఆహారాన్ని తినమని సూచిస్తున్నారు. ఆ ఆహార పదార్థాలు ఏంటో ఓ సారి తెలుసుకుందాం. 
 
ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు శరీరానికి విటమిన్ బి అందదు. అందువల్ల శరీరానికి విటమిన్ బి అందిస్తే చాలా మేరకు ఒత్తిడి తగ్గుతుంది. ఆకుకూరల్లోను, పచ్చి బఠానీలలోనూ విటమిన్ బి ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఒత్తిడి తగ్గించుకోవాలనుకొనే వారు వారంలో కనీసం నాలుగు సార్లు పచ్చిబఠానీలు. ఆకుకూరలు తప్పనిసరిగా తినాలి. వీటి వల్ల శరీరానికి మెగ్నీషియం కూడా అందుతుంది. 
 
ప్రతి రోజూ క్యారెట్ వంటి గట్టిగా ఉండే పచ్చికూరలు తినటం కూడా మంచిదే. మన శరీరంలో విడుదలయ్యే స్లైస్ హార్మోన్లను నియంత్రించటంలో విటమిన్ సి ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు విటమిన్ సి ట్యాబ్లెట్స్ వాడటం మంచిది.
 
కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉండే అన్నం, పప్పు వంటివి సెరోటోనిన్ ఎక్కువగా విడుదలయ్యేందుకు తోడ్పడతాయి. సెరో టోనిన్ ఎక్కువగా విడుదలయితే ఒత్తిడి తగ్గుతుంది. అందువల్ల ఎక్కువ ఒత్తిడి ఉన్నప్పుడు కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉన్నఆహారం తినటం మంచిది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం ... పిడుగుపాటుకు ఇద్దరు మృతి (Video)

వివేకా కుమార్తె సునీతను ఏమైనా చేస్తారనే భయం ఉంది : వైఎస్ షర్మిల

బోయ్ ఫ్రెండ్ కౌగిలించుకోలేదని 14 అంతస్తుల కాలేజీ భవనం పైనుంచి దూకేసిన యువతి

అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్

జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

తర్వాతి కథనం
Show comments