రక్తపోటును అదుపులో పెట్టే అరటి పండు..

Webdunia
మంగళవారం, 24 సెప్టెంబరు 2019 (09:54 IST)
రక్తపోటును అదుపులో ఉంచుకోవటం కోసం ఒత్తిడిని తగ్గించుకునే మార్గాలను  అనుసరించటం, జీవన శైలిలో మార్పులు, మందులు, వ్యాయామం... ఇలా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వుంటాం. అయితే తీసుకునే ఆహారం కూడా రక్తపోటు మీద ప్రభావం చూపిస్తుంది. అలాంటి ఆహారంలో అరటి పండు ఒకటి. రక్తపోటు వున్న వాళ్లకి వైద్యులు అరటి పండు తినమని సూచిస్తూ ఉంటారు. నిజానికి అరటిపండుకి అంత శక్తి వుందా... అనే అనుమానం అందరికీ వస్తుంది. 
 
అరటి పండు మన శరీరం మీద చూపించే ప్రభావం గురించి తెలుసుకునే ముందు మూత్రపిండాల పనితీరు గురించి తెలుసుకోవాలి. మూత్రపిండాలు మన శరీరంలోని ద్రవాలను వడపోస్తూ అదనంగా వున్న ద్రవాల్ని విసర్జించేలా చేస్తూ శరీరంలో నీటి శాతాన్ని సమంగా ఉంచుతూ ఉంటాయి. ఈ ప్రాసెస్ అంతా మన రక్తపోటు మీద ప్రభావం చూపిస్తుంది. శరీరంలో ఎక్కువ ద్రవాలు నిల్వ ఉండిపోతే రక్తపోటు పెరిగిపోతుంది. తక్కువ ఉంటే రక్తపోటు పడిపోతుంది. ఈ రెండూ ప్రమాదమే. 
 
ఇలా శరీరంలోని ద్రవ పరిమాణం హెచ్చుతగ్గులకు గురి కాకుండా కిడ్నీలు.. సోడియం, పొటాషంయం అనే రసాయనాల మధ్య సమతూకాన్ని పాటిస్తాయి. పొటాషియం ఎక్కువుగా నీటిని కిడ్నీల్లోకి చేరవేస్తే, సోడియం నీటిని కిడ్నీల్లోకి చేరకుండా నియంత్రిస్తుంది. మనం ఆహారం ద్వారా తీసుకున్న ఉప్పు వల్ల శరీరంలో నీరు నిల్వ వుండిపోయి రక్తపోటు పెరిగిపోతుంది. 
 
ఇలా జరుగకుండా ఉండాలంటే అలా నిల్వ వున్న నీటిని కిడ్నీల్లోకి చేరవేసే పొటాషియం ఉన్న ఆహారం తీసుకోవాలి. ఒక అరటి పండులో 422 మి.గ్రా. పొటాషియం ఉంటుంది. మనకు ఒక రోజుకి అవసరమైన 4,700 మి.గ్రా. ఇది పదిశాతానికి సమానం. కాబట్టి రక్తపోటు ఉన్నవారు రోజుకో అరటిపండు తినటం మేలని వైద్యులు సలహా ఇస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Bhimavaram: ఎనిమిది మంది రౌడీ షీటర్లను అరెస్ట్ చేసిన భీమవరం పోలీసులు

తిరుమల రాపూర్-చిట్వేల్ ఘాట్ రోడ్డు అటవీ ప్రాంతంలో జంట ఆత్మహత్య

నాపై జరుగుతున్న విషప్రచారంపై కోర్టు గ్యాగ్ ఆర్డర్, తక్షణమే ఆ కంటెంట్ తొలగించాలి: బీఆర్ నాయుడు

టెహ్రాన్‌పై బాంబుల వర్షం - సురక్షిత ప్రాంతాలకు భారతీయ విద్యార్థుల తరలింపు

ఇరాన్ అధ్యక్ష భవన్‌పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అప్పట్లో ఎకరం 9 లక్షలకు అమ్మా, ఇప్పుడక్కడ ఎకరం 100 కోట్లు, ఏం చేస్తాం?: నటుడు శివాజీ

Chiranjeevi: పెద్ది చిత్రం రైరై రారా పాట లో చరణ్ కష్టానికి ఫలితం దక్కింది : మెగాస్టార్ చిరంజీవి

Laya: మా అమ్మాయి ఓటీటీలో సినిమా అనగానే ఎంతో బాధపడింది : లయ

Pooja : దోశ డైరీస్ పై మంచి కథలన్నీ నిర్మించాలని ఉంది.: పూజా శరత్ కుమార్

Manoj: డేవిడ్ రెడ్డి షూటింగ్‌తో మనోజ్ బిజీ - సొంత సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్న మౌనిక

తర్వాతి కథనం
Show comments