Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రక్తపోటు వల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసా?

రక్తపోటు వల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసా?
, సోమవారం, 9 సెప్టెంబరు 2019 (12:02 IST)
అధిక రక్తపోటు 'నిశ్శబ్ద హంతకి' పైకి ఎలాంటి లక్షణాలు లేకుండనే లోలోపల తీవ్ర అనర్థాలకు దారితీస్తుంది. కళ్ల నుంచి కాళ్ల వరకు అన్ని అవయవాలను దెబ్బతీస్తుంది.
 
*అధిక రక్తపోటు మూలంగా కళ్లలోని సూక్ష్మ రక్తనాళాలు దెబ్బతిని కంటి చూపు తగ్గిపోవచ్చు.
 
*గుండె మరింత బలంగా పనిచేయాల్సి రావటం వల్ల గుండె పెద్దగా అవ్వచ్చు. దీంతో శరీరానికి తగినంత రక్తాన్ని సరఫరా చేయలేక గుండె చేతులెత్తేయొచ్చు.
 
*రక్తనాళాల్లో పూడికలు తలెత్తటం వల్ల కాళ్లకు రక్తసరఫరా తగ్గుతుంది. దీంతో నడుస్తున్నప్పుడు నొప్పి, నీరసం తలెత్తొచ్చు. 
 
*మెదడులోని రక్తనాళాలు దెబ్బతినొచ్చు. బలహీనపడొచ్చు. దీంతో రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడొచ్చు, చిట్లిపోయి రక్తం లీక్ కావొచ్చు. ఫలితంగా పక్షవాతం ముంచుకురావొచ్చు.
 
*రక్తనాళాల లోపలి మార్గం కుంచించుకుపోవటం వల్ల జననాంగాలకు రక్త సరఫరా తగ్గుతుంది. ఫలితంగా మగవారిలో స్తంభనలోపం తలెత్తొచ్చు, ఆడవారిలో శృంగారాసక్తి సన్నగిల్లొచ్చు.
 
*గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు దెబ్బతిని లోపలి మార్గం మూసుకుపోవచ్చు. దీంతో గుండె కండరానికి రక్తసరఫరా తగ్గి గుండెపోటు రావొచ్చు.
మూత్రపిండాల చుట్టురా ఉండే రక్తనాళాలు దెబ్బతినటం వల్ల రక్తాన్ని వడపోసే ప్రక్రియ అస్తవ్యస్తమవుతుంది. చివరికి కిడ్నీ వైఫల్యానికి దారితీస్తుంది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆవు పాల వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.