Webdunia - Bharat's app for daily news and videos

Install App

మానసిక ఒత్తిడి నుంచి వెంటనే ఉపశమనం కోసం ఒక గ్లాస్ ఆ రసం...

పుదీనాలో చాలా ఔషధ గుణాలున్నాయి. పుదీనా ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. అందుకే పుదీనాను కాస్మొటిక్ కంపెనీల్లో, కొన్ని వాటిల్లో విరివిగా వాడుతారు. కొన్ని పుదీన ఆకులను గ్లాసు నీళ్ళలో మరిగించి ఆ కాషాయాన్ని తాగితే జ్వరం తగ్గిపోవడమే కాకుం

Webdunia
శుక్రవారం, 1 డిశెంబరు 2017 (22:17 IST)
పుదీనాలో చాలా ఔషధ గుణాలున్నాయి. పుదీనా ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. అందుకే పుదీనాను కాస్మొటిక్ కంపెనీల్లో, కొన్ని వాటిల్లో విరివిగా వాడుతారు. కొన్ని పుదీన ఆకులను గ్లాసు నీళ్ళలో మరిగించి ఆ కాషాయాన్ని తాగితే జ్వరం తగ్గిపోవడమే కాకుండా కామెర్ల, కడుపులో మంట, మూత్ర సంబంధింత వ్యాధులు , ఛాతి మంటలు నయం అవుతాయి.
 
నెల తప్పిన స్త్రీలు ఒక చెంచాడు పుదిన రసంలో చెంచాడు నిమ్మరసం, చెంచాడు తేనె కలిపి అప్పుడప్పుడూ తీసుకుని తింటూ ఉంటే వికారం, వాంతులు తగ్గిపోతాయి. పుదిన ఆకు రసాన్ని కంటి కింద నల్ల మచ్చలు ఉన్న ప్రాంతంలో రాస్తూ ఉంటే ఆ నల్లరసం నిదానంగా పోతాయి. మానసిక ఒత్తిడికి, నిద్రలేమి సమస్యకు కొన్ని పుదీనా ఆకులను వేడి నీళ్ళలో వేసి అరగంట సేపు తరువాత తాగితే బాగా ఉపశమనం కలుగుతుంది. ప్రశాంతమైన నిద్ర కూడా వస్తుంది. 
 
నోటి సంబంధిత వ్యాధులకు పుదీన బాగా ఉపయోగపడుతుంది. ఈ మధ్యకాలంలో టెన్షన్ లు ఎక్కువగా కొంత మంది పడుతుంటారు. అలాంటి వారు పుదీన ఆకులను అరచేతిలో బాగా నలిపి ఆ రసాన్ని కణతలకు, నుదిటికి రాసుకుంటే తలనొప్పి తగ్గిపోయి చల్లదనాన్ని ఇస్తుంది. పుదిన ఆకుల్ని ఎండబెట్టి చూర్ణం చేసి అందులో తగినంత ఉప్పు చేర్చి ప్రతిరోజు బ్రష్ చేసుకుంటే చిగుళ్ళు గట్టిబడి దంత వ్యాధులు రాకుండా కాపాడుతుంది. అంతే కాదు నోటి దుర్వాసనను కూడా అరికడుతుంది. 
 
కొంతమందికి శరీరంపై దురద, దద్దుర్లు వస్తాయి. అలాంటి వారు గ్లాసు నీటిలో పుదిన ఆకులను నాన బెట్టి బెల్లాన్ని కలిపి దాంతో పాటు తీసుకుంటే దురద, దద్దర్లు తగ్గుతాయి. చిన్న పిల్లలు కడుపునొప్పితో బాధపడుతుంటే గోర వెచ్చని నీటిలో ఐదు లేక ఆరుచుక్కల పుదిన రసం వేసి తాగించడం వల్ల కడుపులో నొప్పి, కడుపు ఉబ్బరం తగ్గుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సంగారెడ్డిలో గంజాయి.. 30 గుంటల్లో సాగు చేశారు.. చివరికి?

నెల్లూరు పరువు హత్య.. యువతిని చంపి.. ఇంటి వద్దే పూడ్చేశారు..

ప్లీజ్... ముందస్తు బెయిల్ ఇవ్వండి : హైకోర్టులో కాంతిరాణా టాటా పిటిషన్

రూ.320కే నెయ్యి వస్తుందని శ్రీవారి లడ్డూను కల్తీ చేశారు : సీఎం చంద్రబాబు

తిరుమలకు సరఫరా చేసిన నెయ్యిలో నాణ్యతా లోపం లేదు : ఏఆర్ డెయిరీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన్యం ధీరుడు.. సీతారామరాజు చిత్రం ఎలా వుందంటే.. రివ్యూ

చిరంజీవికి అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి అవార్డ్ ప్రకటించిన నాగార్జున

జయం రవి కాపురంలో చిచ్చుపెట్టిన బెంగుళూరు సింగర్?

ఫియర్ ద్వారా ఆ లిస్టులో ఇండియా పేరు చూసినప్పుడు గర్వంగా అనిపించింది: దర్శకురాలు హరిత

ప్లీజ్ ... నో పాలిటిక్స్ : రజనీకాంత్

తర్వాతి కథనం
Show comments