Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాదం మిశ్రమాన్ని పాలలో కలిపి తీసుకుంటే..?

Webdunia
శనివారం, 8 డిశెంబరు 2018 (10:10 IST)
సూపర్ ఫుడ్ జాజితాలో బాదం ముందు వరుసలో ఉంటుంది. వీటిలో ప్రోటీన్స్, ఫైబర్, విటమిన్ ఇ, ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్, క్యాల్షియం, మెగ్నిషియం, జింక్ వంటి ఖనిజాలు అధిక మోతాదులో ఉంటాయి. బాదం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలోని మినరల్స్ కంటి ఆరోగ్యానికి చాలా ఉపకరిస్తాయి. బాదంలోని మరికొన్ని ప్రయోజనాలు ఓసారి పరిశీలిద్దాం...
 
1. చాలామంది తరచు బాదం పప్పులను నేరుగానే తీసుకుంటారు. బాదాం శరీరాన్ని వేడిగా ఉంచుతుంది. జీర్ణప్రక్రియకు సాయం చేస్తుంది. అంతేకాదా.. శరీరంలోని చెడు పదార్థాలను తొలగిస్తుంది. బాదం పప్పులను నానబెట్టి తీసుకుంటే ఎంతో మేలు చేస్తుంది.
 
2. బాదం తీసుకునేటప్పుడు దాని పొట్టును కూడా తీసుకోవాలి. బాదం పొట్టులో విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. ఈ విటమిన్ శరీరానికి కావలసిన పోషక విలువలను అందిస్తుంది. ఈ చలికాలంలో వీటిని తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. 
 
3. రాత్రివేళ కప్పు బాదం పప్పులను నీటిలో నానబెట్టుకుని ఉదయాన్నే వాటిని శుభ్రం చేసి మెత్తని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని గ్లాస్ పాలలో వేసి కొద్దిగా చక్కెర లేదా తేనె కలిపి తీసుకుంటే రోజంతా ఎనర్జీగా ఉంటారు. 
 
4. బాదం పప్పులతో చేసిన ఆహార పదార్థాలు తీసుకుంటే శరీర ఒత్తిడి, అలసట నుండి ఉపశమనం లభిస్తుంది. బాదం మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే చర్మం మృదువుగా, ఎంతో కోమలంగా మారుతుంది. 
 
5. పావుకప్పు బాదం పప్పులను పేస్ట్ చేసి అందులో కొద్దిగా కలబంద గుజ్జు, నిమ్మరసం కలిపి ముఖానికి, మెడకు అప్లై చేయాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో కడుక్కుంటే.. ముఖంపై గల నల్లటి మచ్చలు, వలయాలు పోతాయి. 
 
6. బాదం పప్పులను నానబెట్టుకుని పొట్టు తీసి పేస్ట్‌లా చేసుకోవాలి. ఇలా తయారుచేసిన మిశ్రమంలో కొద్దిగా చక్కెర కలిపి తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అనారోగ్య సమస్యల నుండి కాపాడుతుంది. 

సంబంధిత వార్తలు

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

తర్వాతి కథనం
Show comments