Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడుపులో మంట ఎందుకు వస్తుంది, ఏం చేయాలి?

Webdunia
శుక్రవారం, 6 నవంబరు 2020 (23:06 IST)
ఉద్యోగ పని ఒత్తిడిలో చాలామంది భోజనం చేయడాన్ని పక్కనపెట్టేస్తుంటారు. ఫలితంగా కడుపులో మంట... అదే ఎసిడిటీ వస్తుంది. దీన్ని అశ్రద్ధ చేస్తే తీవ్ర అనారోగ్యం చెందుతారు. అందువల్ల ఆదిలోనే దీనికి అడ్డుకట్ట వేయాలి. యాపిల్ పండుతో తయారు చేసిన జ్యూసు, వెనిగర్, తేనెను తగినంత నీటిలో కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని భోజనానికి ముందు సేవించి ఆ తర్వాత భోజనం తీసుకుంటే ఎసిడిటీ నుంచి ఉపశమనం కలుగుతుందంటున్నారు వైద్యులు.
 
1. తీసుకునే ఆహారంలో భోజనానికి భోజనానికి మధ్య ఎక్కువ సమయం ఖాళీ కడుపుతో ఉండకండి. దీంతో ఉదరంలో గ్యాస్ పేరుకుపోయే ప్రమాదం ఉంది. 
 
2. ప్రతి రోజు ఎనిమిది గ్లాసుల నీటిని సేవిచేందుకు ప్రయత్నించండి. 
 
3. అసిడిటీతో బాధపడే వారికి తులసి దివ్యమైన ఔషధం. తులసి ఆకులను నిత్యం చప్పరిస్తుంటే అసిడిటీ నుంచి ఉపశమనం కలుగుతుంది. 
 
4. నిత్యం బెల్లం చప్పరిస్తుంటే అసిడిటీ నుంచి ఉపశమనం కలుగుతుంది. దీనిని ప్రతి రోజు నాలుగు నుంచి ఐదుసార్లు తీసుకుంటుండాలి. 
 
5. తీసుకునే ఆహారంలో వీలైనంత మేరకు వేపుడు పదార్థాలను తగ్గించండి. దీంతోపాటు ఊరగాయ, మసాలా దినుసులతో కూడుకున్న ఆహారం, చాకొలేట్లను తీసుకోకుండా ఉండేందుకు ప్రయత్నించండి.
 
6. పచ్చి కూరగాయలతో తయారుచేసిన సలాడ్‌ను తగు మోతాదులో తీసుకోండి. ఉదాహరణకు... ఉల్లిపాయలు, క్యాబేజీ, ముల్లంగి, వెల్లుల్లి మొదలైనవి.
 
7. ఎసిడిటీతో బాధపడుతుంటే బాదం పప్పులను సేవించండి.
 
8. కొబ్బరి నీళ్ళను రోజుకు మూడు-నాలుగు సార్లు సేవించాలి.
 
9. భోజనానంతరం పుదీనా రసం సేవిస్తే అసిడిటీ నుంచి ఉపశమనం కలిగి మంచి ఫలితాన్నిస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.

సంబంధిత వార్తలు

టిక్కెట్ చూపించమన్న టీటీఈ... రైలు నుంచి కిందికి తోసేసిన ప్రయాణికుడు!!

రామ మంత్రం మహిమ.. పిల్లలతో కలిసి కదం తొక్కిన జింక పిల్ల

ఐఫోన్ పాస్ వర్డ్ మరిచిపోయిన అరవింద్ కేజ్రీవాల్.. తలపట్టుకున్న ఈడీ

'యూత్ ఐకాన్‌'గా ఆయుష్మాన్ ఖురానా.. ఎన్నికల సంఘం నిర్ణయం!!

అసత్య ప్రచారాన్ని అరికట్టడానికి కొత్త వెబ్‌సైట్ - మిథ్ వర్సెస్ రియాలిటీ రిజస్టర్!!

ఎంటర్ టైన్ మెంట్ తో మలిచిన హారర్ చిత్రంగా గీతాంజలి మళ్ళీ వచ్చింది ట్రైలర్

అనుష్కశెట్టి ఇన్ స్టా ఫోటో వైరల్.. మళ్లీ ఫామ్‌లోకి దేవసేన

సూర్య, జ్యోతిక ఏం వర్కౌట్స్ చేస్తున్నారబ్బా.. వీడియో వైరల్

మద్యం సేవిస్తూ రాంగోపాల్ వర్మ.. పక్కనే సురేఖా వాణి కుమార్తె సుప్రీత... ఏంటి సంగతి?

తెలుగు నటి నీలం ఉపాధ్యాయతో ప్రియాంక చోప్రా తమ్ముడి నిశ్చితార్థం

తర్వాతి కథనం
Show comments