Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరల్డ్ ఎగ్ డే: ఆరోగ్య ప్రదాత... రుచికరం..

"సండే హోయా మండే.. రోజ్ ఖావో అండే" అనేది నేషనల్ ఎగ్- కో ఆర్డినేషన్ నినాదం. ఈ నినాదం ప్రభావం ఏమో కానీ… దేశంలో రోజు రోజుకీ గుడ్డు తినేవారి సంఖ్య పెరిగిపోతుంది. కుల, మతాలకు అతీతంగా అందరూ తినే పోషకాహారం గు

Webdunia
శుక్రవారం, 13 అక్టోబరు 2017 (09:53 IST)
"సండే హోయా మండే.. రోజ్ ఖావో అండే" అనేది నేషనల్ ఎగ్- కో ఆర్డినేషన్ నినాదం. ఈ నినాదం ప్రభావం ఏమో కానీ… దేశంలో రోజు రోజుకీ గుడ్డు తినేవారి సంఖ్య పెరిగిపోతుంది. కుల, మతాలకు అతీతంగా అందరూ తినే పోషకాహారం గుడ్డు. వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ అనే తేడా లేకుండా ఎగ్గేరియన్స్ పెరిగిపోతున్నారు. 
 
ప్రస్తుతం నానాటికీ కాయకూరల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఏది కొనాలన్నా జేబుకు చిల్లు పడుతోంది. ఈ పరిస్థితుల్లో అతి తక్కువ ధరకు ఎక్కువ పోషకాలుండే మంచి ఆహార పదార్థంగా గుడ్డు పేరుగడించింది. దీంతో రోజూ కోట్లకి కోట్ల గుడ్లు సేలవుతున్నాయి. అందుకే గుడ్డుకి భారీ డిమాండ్ పెరిగింది. రోజూ ఓ గుడ్డు తింటే హాస్పిటల్‌కి వెళ్లాల్సిన పనిలేదని పెద్దలతో పాటు వైద్యులు చెబుతుంటారు. 
 
గతంలో సఘటున ఒక వ్యక్తి సంవత్సరానికి 40 నుంచి 50 గుడ్లు లాగిస్తుండగా ప్రస్తుతం ఆ సంఖ్య వందకు చేరింది. రెస్టారెంట్ల నుంచి… బజ్జీ బండ్ల వరకు.. బేకరీల్లో కూడా ఎగ్టేస్ట్ దొరుకుతుంది. కేకుల్లో కూడా ఎగ్స్ వెరీ వెరీ స్పెషల్. దేశంలో ఎగ్గుని తినేవారిలో తమిళనాడు వారు ముందుండగా… కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ తర్వాత ప్లేసులో ఉంది. మన రాష్ట్రం నాలుగో ప్లేసులో ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే పట్టణ ప్రాంతాల్లోనే ఎగ్స్‌ను తీసుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉందని ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ చెపుతోంది.
 
ఇక గుడ్డు మీద జరుగుతున్న పరిశోధనలు కూడా ప్రతీ ఏటా కొత్త ఫలితాలను ఇస్తున్నాయి. గుడ్డును తీసుకోవాల్సిన అవసరాన్ని పదే పదే నొక్కి చెబుతున్నాయి. ప్రతీ రోజు ఓ గుడ్డును తీసుకోవడం వల్ల బాడీ ఎదుగుదలకు, కంటిచూపు మంచిగా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. ఎగ్స్‌ను తినడం వల్ల గుండె జబ్బులు వస్తాయనడం కేవలం అపోహ మాత్రమే అనేది వైద్యుల మాట. ఎగ్గుతింటే ఎనర్జిటిక్‌గా ఉంటామని చెబుతున్నారు నిపుణులు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments