Webdunia - Bharat's app for daily news and videos

Install App

రుతుక్రమం సమయంలో వ్యాయామం చేయొచ్చా?

రుతుక్రమం సమయంలో వ్యాయామం చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల పొట్టలో క్రాంప్స్ తగ్గుతాయి. అలాగే శరీరం అలసిపోయినప్పుడు ఖచ్చితంగా వ్యాయామం చేయాలి. 30 నిమిషాల వ్యాయామం వల్ల రక్త ప్రసరణ పెరిగ

Webdunia
గురువారం, 13 ఏప్రియల్ 2017 (13:59 IST)
రుతుక్రమం సమయంలో వ్యాయామం చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల పొట్టలో క్రాంప్స్ తగ్గుతాయి. అలాగే శరీరం అలసిపోయినప్పుడు ఖచ్చితంగా వ్యాయామం చేయాలి. 30 నిమిషాల వ్యాయామం వల్ల రక్త ప్రసరణ పెరిగి, ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి. భోజనం తర్వాత వ్యాయామం చేయకూడదు. ఆహారం తీసుకున్న తర్వాత వ్యాయామం చేయడం వల్ల జీర్ణక్రియకు ఇబ్బంది కలుగుతుంది. అలాగే పేగులపైనా ప్రభావం పడుతుంది. 
 
ఒబిసిటీకి దూరంగా ఉండాలంటే తృణధాన్యాలు, గుండెకు మేలు చేసే ఆహారాలను డైట్‌లో చేర్చుకోవాలి. ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనె వంటివి ఆరోగ్యానికి మంచిది. కాబట్టి వీటినే తీసుకోవాలి. ఇందులో ఫ్యాట్ తక్కువగా ఉంటుంది... ఆరోగ్యానికీ మంచిది. ఒత్తిడి రకరకాల అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. ప్రశాంతంగా ఉండటానికి జాగ్రత్తలు తీసుకోవాలి.
 
ఇక వర్కవుట్‌కి ముందు స్నాక్స్ అయినా తీసుకోవాలి. ఏమీ తినకుండా వర్కవుట్ చేయడం వల్ల బరువు తగ్గడమేగానీ, కండరాల నొప్పులు వస్తాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో అరటిపండ్లు తినడం వల్ల శరీరంలో మెగ్నీషియం లెవెల్స్ బాగా పెరుగుతాయి. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు.
 
మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్యలో ఎక్సర్ సైజ్ చేయడం వల్ల ఆరోగ్యానికి మంచిది. ఈ సమయంలో శరీర ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో వ్యాయామం చేయడం వల్ల ఎక్కువ చెమట బయటికి వస్తుంది. తద్వారా బరువు తగ్గుతారు. 

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

తర్వాతి కథనం
Show comments