Webdunia - Bharat's app for daily news and videos

Install App

చావుబతుకుల మధ్య మణిపాల్ ఆసుపత్రికి మహిళా రోగి, కాపాడిన వైద్యులు

Webdunia
శుక్రవారం, 22 జనవరి 2021 (16:36 IST)
విజయవాడ: ఇటీవల 28 సంవత్సరాల వయసు కలిగిన ఒక మహిళ శ్రీమతి దివ్య (పేరు మార్చటమైనది) అర్థరాత్రి సమయంలో గత మూడు రోజులుగా జ్వరం తోపాటు చలి, వెన్నులో నొప్పి, వికారం మరియు వాంతులతో బాధపడుతున్నానని మా మణిపాల్ హాస్పిటల్, విజయవాడకు వచ్చారు. అంతేకాక తనకు మొదటిరోజు నుంచి మూత్ర విసర్జన తక్కువ జరుగుతున్నదని మరియు శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడుతున్నట్లు కూడ చెప్పారు.
 
ఆమెకు నిర్వహించిన శస్త్ర చికిత్స గురించి డా.శ్రీధర్, కన్సల్టెంట్ నెఫ్రాలజీ & కిడ్నీ మార్పిడి వైద్యులు-మణిపాల్ హాస్పిటల్, విజయవాడ వారు మాట్లాడుతూ, “ఆమె హాస్పిటల్‌కు వచ్చిన సమయంలో చాల అయోమయ స్థితిలో ఉన్నారు. ఆమె శ్వాస తీసుకోవటంలోను మరియు మూత్ర విసర్జన చేయుటలోను ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఆమెను పరీక్షించిన తర్వాత, ఆమె తీవ్రమైన మూత్ర పిండాల వైఫల్యత, తీవ్రమైన శ్వాస సంబంధిత ఇబ్బంది సిండ్రోమ్ (ARDS), ల్యూకోసైటోసిస్ (తెల్లరక్త కణాలు పెరగటం), పెల్విక్ యురెటేరిక్ జంక్షన్ కాలిక్యులస్ తోటి రైట్ అక్యూట్ పైలోనేఫ్రిటిస్ వ్యాధులతో బాధపడుతున్నట్లు గుర్తించాము.
 
పైన తెలిపిన ఇన్ని విధాలైన తీవ్రమైన ఇబ్బందులు ఈ కేసులో వుండటం వలన రోగి ప్రాణాపాయ స్థితికి చాల చేరువులో ఉన్నట్లు మేము తెలుసుకున్నాము. ఆమె సంక్లిష్టమైనపై పరిస్థితిని గమనించి, ఆమెను 8 గంటలు పాటు వాసోప్రెసర్స్ మరియు SLED-F (సస్టైండ్ లో-ఎఫిసియన్సీ హిమోడయాఫిల్టరేషన్ )తోటి మెకానికల్ వెంటిలేషన్ పైన ఉంచాము. అటుతర్వాత, ఆమెకు సిస్టోస్కోపీ చేయటం మరియు కుడి మూత్రనాళం (యురేటర్) నకు DJ స్టెంట్ వేయటం జరిగినది. డా.రవిశంకర్-యూరాలజీ, డా.లక్ష్మి ప్రసూన-గైనకాలజీ, డా.బాలాజీ- ఎనస్తీషియాలతో కూడిన డాక్టర్ల బృందం ఇతోధికంగా శ్రమించి ఆమె ప్రాణాలు కాపాడగలిగారు అని వివరించారు.
 
డా.సుధాకర్ కంటిపూడి- హాస్పిటల్ డైరక్టర్, మణిపాల్ హాస్పిటల్, విజయవాడ వారు మాట్లాడుతూ, “ఆమె తమ హాస్పిటల్‌కు వచ్చే సమయానికి చావు-బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఆమెకు సరియైన చికిత్స అందించుటకు చర్యలు చేపట్టుటకు ముందుగా ఆమె ప్రస్తుత పరిస్థితిని కొంత చక్కబరచటం మాకు చాల కీలకం అయ్యింది అన్నారు. రోగికి విజయవంతంగా చికిత్స అందించి మరియు ఆమె తిరిగి హాయిగా ఊపిరిపీల్చుకుని సాధారణ జీవితం గడిపేలా ఆరోగ్యం అందించిన డా. శ్రీధర్ మరియు ఆయన బృందాన్ని ఈసందర్భంగా అభినందిస్తూ మరియు ధన్యవాదాలు తెలుపుతున్నాను అని చెప్పారు. ఒక రోగి కోలుకుని తన సాధారణ జీవితం గడపటానికి సమాయత్తం కావటం మాకు ఆనందదాయకం మరియు ఆరోగ్య సంరక్షణ  ప్రదాతగా ఈ క్షణాలు మాకు సంతోషాన్ని కలిగించాయి అన్నారు.
 
ఆమె రక్తపోటు(బ్లడ్ ప్రెషర్ ) సాధారణ స్థితికి రావటంతో, రోగి ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగుపడి, ఆమె మూత్ర విసర్జనలో (యూరినరీ అవుట్ పుట్) మెరుగుదల వచ్చినది. అటుతర్వాత ఆమెకు వెంటిలేషన్ మద్దతు కూడా తీసివేసాము. ఆమె మూత్రపిండాల వైఫల్యత నుండి పూర్తిగా కోలుకున్నారు. ఆ తర్వాత ఆమె ఒక నెల రోజులకు కుడి మూత్ర పిండం కాలిక్యులస్ కొరకు పెర్క్యుటేనియస్ నెఫ్రో లితోటమీ (PCNL) విజయవంతంగా చేయించుకున్నారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments