Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మార్ట్ ఫోన్‌తో పుర్రె వెనుకభాగంలో కొమ్ములు...

Webdunia
సోమవారం, 24 జూన్ 2019 (14:04 IST)
పొద్దస్తమానం స్మార్ట్‌ఫోన్‌తోనే గడుపుతున్నారా? ముఖ్యంగా, గంటల కొద్ది తలవంచి స్మార్ట్‌ఫోనునే చూస్తున్నారా? అయితే, మీ పుర్రె వెనుక భాగంలో కొమ్ములు వచ్చివుంటాయి. ఓసారి వైద్యుడిని సంప్రదించి చెక్ చేయించుకోండి. లేదంటే ప్రాణాపాయం తప్పదు. ఈ మాట అంటున్నది ఎవరో కాదు.. ఆస్ట్రేలియా పరిశోధకులు. 
 
గంటల కొద్దీ స్మార్ట్ ఫోన్ చూసేందుకు మెడ భాగాన్ని అలా ఎక్కువసేపు వంచి ఫోన్‌ తెర వైపే చూస్తూ గడపడం వల్ల.. అక్కడి కండరాలపై అదనపు ఒత్తిడి పడి.. పుర్రె వెనుక దిగువ భాగంలో ఎముక పెరుగుతోందని (బోన్‌ స్పర్స్‌) ఆస్ట్రేలియా పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. శాస్త్రజ్ఞులు వీటిని 'ఎంథియోసోఫైట్స్'గా పేర్కొంటున్నారు. 
 
ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్‌ ద సన్‌షైన్‌ కోస్ట్‌లో హెల్త్‌ సైంటిస్ట్‌గా పనిచేస్తున్న డేవిడ్‌ షహర్‌, ఆయన సహచరుడు మార్క్‌సేయర్స్‌ 2016లో.. 1200 మందిపై నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం బయటపడింది. ఈ అధ్యయన ఫలితం 2018లోనే 'సైంటిఫిక్‌ రిపోర్ట్స్' జర్నల్‌లో ప్రచురితమైనా.. అప్పట్లో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ, పలువురు స్మార్ట్  ఫోన్ వినియోగదారుల్లో ఈ సమస్య ఉత్పన్నంకావడంతో దీనిపై శాస్త్రవేత్తలు దృష్టిసారించారు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments