Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతిరోజూ 3,500 మందిని కబళిస్తున్న హెపటైటిస్ వైరస్‌: ప్రపంచ ఆరోగ్య సంస్థ

సిహెచ్
బుధవారం, 10 ఏప్రియల్ 2024 (15:46 IST)
ప్రపంచవ్యాప్తంగా హెపటైటిస్ వైరస్ ఇన్ఫెక్షన్ల వల్ల ప్రతిరోజూ 3,500 మంది మృతి చెందుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలో తెలిపింది. హెపటైటిస్ బి నుండి 83 శాతం, హెపటైటిస్ సి నుండి 17 శాతం మరణాలు సంభవిస్తున్నట్లు వెల్లడించింది. ఈ హెపటైటిస్ వైరస్ అనేది రెండవ అతిపెద్ద కిల్లర్‌ అనీ, దీన్ని అడ్డుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలంటూ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది.
 
పోర్చుగల్‌లో జరిగిన ప్రపంచ హెపటైటిస్ సమావేశంలో విడుదల చేసిన నివేదికలోని వివరాలు ఇలా వున్నాయి. 2019లో 1.1 మిలియన్ల మంది ఈ వైరస్ కారణంగా చనిపోయారు. ఇక 2022లో ఈ సంఖ్య 1.3 మిలియన్లకు పెరిగిందని 187 దేశాల నుండి వచ్చిన సమాచారాన్ని వెల్లడించింది. హెపటైటిస్ ఇన్ఫెక్షన్లకు పలు కారణాలుంటున్నట్లు తెలిపింది.
 
ఈ వైరస్‌లకు చికిత్స చేయగల సమర్థవంతమైన మందులు అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ దీర్ఘకాలిక హెపటైటిస్ బి ఉన్నవారిలో కేవలం మూడు శాతం మంది మాత్రమే 2022 చివరి నాటికి యాంటీవైరల్ చికిత్స పొందారని నివేదిక పేర్కొంది. దీనికి కారణం వ్యాధి నిర్థారణలో జరుగుతున్న జాప్యం కారణమని చెప్పారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments