Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్కిన్సన్ వ్యాధి హాట్‌స్పాట్‌గా భారత్.. అందుబాటులో సరికొత్త చికిత్స

Webdunia
శుక్రవారం, 18 మార్చి 2022 (19:50 IST)
భారత్ పార్కిన్సన్ వ్యాధికి కేంద్ర బిందువుగా మారుతోందని చెన్నై మహానగరంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన వెస్ట్‌మినిస్టర్ ఆస్పత్రి వైద్య బృందం వెల్లడించింది. ప్రస్తుతం భారత్‌లో 5,80,000 మంది పార్కిన్సన్ వ్యాధిగ్రస్తులు ఉన్నారని ఆ బృందం తెలిపింది. ఇది వచ్చే 2030 నాటికి రెట్టింపు అవుతుందంటూ ఆందోళన వ్యక్తం చేసింది. 
 
ఇదే అంశంపై లండన్‌లోని కింగ్స్ కాలేజ్ హాస్పిటల్‌లోని మూవ్‌మెంట్ డిజార్డర్స్, పార్కిన్సన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ డైరెక్టర్ డాక్టర్ వినోద్ మెట్టా, చెన్నై వెస్ట్‌మినిస్టర్ ఆస్పత్రి సెలెరా న్యూరో సైన్సెస్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ బాబూ నారాయణన్‌లు మాట్లాడుతూ, వెస్ట్‌మిన్‌స్టర్ హాస్పిటల్‌లో డి-మైన్ పంపులు, పెన్నుల (సిరంజ్) టైప్ చికిత్సా విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు. 'అపోమోర్ఫిన్ థెరపీ ఆఫ్ పీరియడ్స్‌లో మందులు తీసుకునే సమయంలో ఉపశమనం ఇస్తుందని, కొద్ది రోజుల తర్వాత అవి సరిగా పని చేయడం లేదన్నారు. ఫలితంగా, రోగుల్లో వణుకు, పటుత్వం కోల్పోవడం, ఆందోళన చెందడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయన్నారు. 
 
'ఐరోపాలో విస్తృతంగా ఉపయోగించే ప్రపంచ-స్థాయి అపోమోర్ఫిన్ థెరపీని చెన్నైలోని రోగులకు డి-మైన్ పంపులు, సిరంజ్‌ల ద్వారా అందించే చికిత్సా విధానాన్ని ప్రవేశపెట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. వణుకుతున్న చేతులతో చేయడం కష్టం అయిన అపోమోర్ఫిన్ యొక్క ఆంపుల్స్‌ను విచ్ఛిన్నం చేసిన తర్వాత రోగులు వాటిని రీఫిల్ చేయాలి. దీనికి విరుద్ధంగా, డి-మైన్ అపోమోర్ఫిన్ పంపులను ఐదు సులభమైన దశల్లో రోగులు స్వయంగా వాడుకోవచ్చని తెలిపారు. 
 
రోగులలో ఎక్కువ మంది 50 ఏళ్లు పైబడిన వారే అయినప్పటికీ, యువ జనాభాలో కూడా సమస్య పెరుగుతుందన్నారు. దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై భారం పడేలా పార్కిన్సన్స్ ఒక పెద్ద నాన్-కమ్యూనికేబుల్ డిజెనరేటివ్ డిజార్డర్‌గా ఉద్భవించడానికి ఆస్కారాలు ఉన్నాయని చెప్పారు. 
 
అయితే, చెన్నైలోని పార్కిన్సన్స్ డిసీజ్ రోగులకు ఒక వరంలా, జర్మన్ ఫార్మా మేజర్ ఎవర్ ఫార్మా తయారు చేసిన అధునాతన డి-మైన్ అపోమోర్ఫిన్ పంపులు మరియు పెన్నులు (ఇంజెక్షన్లు) సెలెరా న్యూరో సైన్సెస్‌ను అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపారు. ఐరోపాలో విస్తృతంగా ఉపయోగించే ఈ థర్డ్ జనరేషన్ అపోమోర్ఫిన్-డెలివరీ పరికరాలు ఇప్పుడు వెస్ట్‌మినిస్టర్ హాస్పిటల్‌లోని రోగులకు అందుబాటులో ఉన్నాయి.
 
సెలెరా న్యూరో సైన్సెస్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ బాబూ నారాయణన్ మాట్లాడుతూ, పార్కిన్సన్స్ రోగులకు ఆధునిక యూరోపియన్ అపోమోర్ఫిన్ పరికరాలు అందుబాటులో ఉండటం భారతదేశంలో ఇదే మొదటిసారని, అందులోనూ చెన్నైలో అందుబాటులోకి తీసుకుని రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఓ మహిళతో ఇద్దరు ఆటో డ్రైవర్ల అక్రమ సంబంధం.. హన్మకొండలో లైవ్ మర్డర్ (Video)

ఉప ముఖ్యమంత్రి పదవిపై మంత్రి లోకేశ్ ఏమన్నారు?

టర్కీ హోటల్‌లో ఘోర ప్రమాదం.. 76 మంది మృత్యువాత

AI కోసం 500 బిలియన్ డాలర్ల పెట్టుబడులు-అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

హెచ్ఐవీ బాధిత బాలికను సైతం వదిలిపెట్టని కామాంధుడు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: తమన్నాను ఆంటీ అని పిలిచిన రవీనా టాండన్ కుమార్తె.. ఏమైందంటే?

బ్యాడ్ బాయ్ కార్తీక్ గా రాబోతున్నాఅంటున్న నాగశౌర్య

'పుష్ప-2' రికార్డులన్నీ ఫేకా? లెక్కల నిగ్గు తేలుస్తున్న ఐటీ అధికారులు!!

మిలియన్ల ఆస్తి సంపాదించా, కానీ ఐ.టీ.కి దొరకను : అనిల్ రావిపూడి

రూల్స్ పాటించకపోతే లైసెన్స్ రద్దు చేస్తాం : నందమూరి బాలక్రిష్ణ

తర్వాతి కథనం
Show comments