Webdunia - Bharat's app for daily news and videos

Install App

కదలకుండా కూర్చొని పని చేస్తున్నారా... అయితే, మీ ఆయుష్షు...

ప్రతి మనిషి జీవితం యాంత్రికంగా మారిపోయింది. కొందరు ఉరుకులు పరుగులతో జీవితం కొనసాగిస్తుంటే, మరికొందరు కూర్చొన్న చోటే అటూఇటూ కదలకుండా పనిచేస్తున్నారు. ఇలాంటి వారే ఎక్కువ అనారోగ్య సమస్యల బారినపడుతున్నట్ట

Webdunia
బుధవారం, 12 సెప్టెంబరు 2018 (10:40 IST)
ప్రతి మనిషి జీవితం యాంత్రికంగా మారిపోయింది. కొందరు ఉరుకులు పరుగులతో జీవితం కొనసాగిస్తుంటే, మరికొందరు కూర్చొన్న చోటే అటూఇటూ కదలకుండా పనిచేస్తున్నారు. ఇలాంటి వారే ఎక్కువ అనారోగ్య సమస్యల బారినపడుతున్నట్టు ఓ సర్వేలో తేలింది. ఒకేచోట.. కదలకుండా పని చేసేవారు అనారోగ్యం బారినపడటమే కాకుండా వారి ఆయుష్షు కూడా బాగా తగ్గినట్టు సర్వేలు హెచ్చరిస్తున్నాయి.
 
అయితే, ఎక్కువ కూర్చుంటే కలిగే అనర్ధాలు ఏముంటాయిలే అనుకోకండి. గంటల తరబడి కుర్చీలకు పరిమితమైతే మధుమేహం, గుండె సంబంధిత రోగాల బారిన పడాల్సిందేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చాలామంది కూర్చొని పనిచేస్తుండటంతో శారీరక శ్రమ తగ్గి తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నట్టు  పలు అధ్యయన ఫలితాలు వెల్లడిస్తున్నాయి. 
 
ఇటీవల కెనడా, ఆస్ట్రేలియా దేశాల్లో జరిపిన ఒక అధ్యయనంలో 45 ఏళ్లు, ఆపై వయసున్నవారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కదలకుండా కూర్చొని పనిచేయడంవల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని... జీవన ప్రమాణం తగ్గుతోందని చెప్పారు. ఎక్కువసేపు టీవీ చూడటం, కదలకుండా కూర్చుని కంప్యూటర్ల ముందు పనిచేసేవారే ఎక్కువగా అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు.
 
నేటి ఉరుకులు పరుగుల జీవితంలో చాలామందిలో శరీరక శ్రమ తక్కువైందని, నిత్యం ఆరోగ్యంగా ఉండాలంటే రన్నింగ్, వాకింగ్ తప్పనిసరి అని సర్వేలు చెబుతున్నాయి. వ్యాయామం వల్ల శరీరంలోని అన్ని కండరాలకు సరైన రక్తప్రసరణ జరిగి ఉత్సాహంగా ఉండొచ్చనేది నిపుణులు అభిప్రాయం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రి కావడం దురదృష్టకరం: కల్వకుంట్ల కవిత (video)

పవన్ కల్యాణ్ అడివి తల్లి బాట.. ప్రత్యేక వీడియోను విడుదల చేసిన జనసేన (video)

భారతదేశానికి తహవ్వూర్ రాణా.. భద్రత కట్టుదిట్టం.. విచారణ ఎలా జరుగుతుందంటే?

భర్త మరణం తర్వాత కువైట్‌కి వెళ్తే.. అక్కడ యాసిడ్ పోశారు.. చివరికి గత్యంతరం లేక?

గాంధీ కుటుంబమే ఆ పని చేయలేకపోయింది.. రేవంత్ ఏం చేయగలడు: ఏపీ బీజేపీ మంత్రి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

తర్వాతి కథనం
Show comments