తెల్లగా మల్లెపువ్వులాంటి అన్నం... అందులో ఏముందో తెలుసా?

పూర్వం మన పూర్వీకులు వడ్ల గింజలను దంచి వచ్చిన బియ్యంతో అన్నం వండుకునేవారు. దానివల్ల వారికి రోగనిరోధకశక్తి ఎక్కువగా ఉండేది. ఇప్పుడు మనం తెల్ల బియ్యంను ఆశ్రయించి అనారోగ్యం పాలవుతున్నాము. ఎప్పటినుండైతే మనిషి మిల్లులను కనుక్కున్నాడో అప్పటి నుండి బియ్యాన్

Webdunia
గురువారం, 7 డిశెంబరు 2017 (20:35 IST)
పూర్వం మన పూర్వీకులు వడ్ల గింజలను దంచి వచ్చిన బియ్యంతో అన్నం వండుకునేవారు. దానివల్ల వారికి రోగనిరోధకశక్తి ఎక్కువగా ఉండేది. ఇప్పుడు మనం తెల్ల బియ్యంను ఆశ్రయించి అనారోగ్యం పాలవుతున్నాము. ఎప్పటినుండైతే మనిషి మిల్లులను కనుక్కున్నాడో అప్పటి నుండి బియ్యాన్ని పాలిష్ పట్టడం మొదలుపెట్టాడు. బియ్యాన్ని పాలిష్ మరలో పోస్తే  ఆ బియ్యంపై ఒక పొరను తీసివేస్తుంది. దీనిని మనం మొదటి పాలిష్ అంటాము. దీని వలన బియ్యంలో అతి ముఖ్యమైన పోషక పదార్థాలు 5 శాతం వరకూ పోతాయి. 
 
ఇవి ముఖ్యంగా 12 రకాల బి విటమిన్లు, విటమిన్ ఇ, పీచుపదార్థాలు, లిసిథిన్ మొదలైనవి. ఈ మొదటి పాలిష్ పోతాయి. దీని నుండి వచ్చిన తౌడును మందుల కంపెనీవారు కొనుక్కొని మందుల తయారీకి వాడతారు. మొదటి పాలిష్ వలన బియ్యము మరీ తెల్లగా రావు. వీటిని మరలా రెండవసారి పాలిష్ వేస్తారు. వీటి వలన బియ్యం తెల్లగా వచ్చి వీటి నుండి 30 శాతం పోషక పదార్థాలు పోతాయి. వీటినుండి వచ్చిన తౌడును గేదెలకు, ఆవులకు, ఇతర జంతువులకు, చేపలకు, రొయ్యలకు బలానికి వాడతారు. ఇంక ఆ తెల్లబియ్యాన్ని మాత్రం మనం ఆనందంగా తింటున్నాము. తెల్లటి బియ్యం వలన మనకు అనేక నష్టాలు ఉన్నాయి.
 
1. బియ్యంలో ఉండే 12 రకాల బి విటమిన్స్ 80 శాతం పైగా కోల్పోయి కేవలం15.20 శాతం మాత్రమే మిగులుతాయి. శరీరానికి బలాన్నిచ్చే బి విటమిన్లు సరిగా లేకపోవడం వలన త్వరగా అలసిపోవడం, నీరసం రావడం, పిక్కలు లాగటం, పనిచేయలేక పోవటం జరుగుతుంది.
 
2. లిసిథిన్ అనే పదార్థం తెల్లటి బియ్యంలో ఉండదు. ఈ పదార్థం మనలో కొవ్వు, కొలెస్ట్రాల్, పదార్థాలు పేరుకోకుండా నివారించేందుకు ఉపయోగపడుతుంది. తెల్లని బియ్యం తినేవారికి ఈ రక్షణ శరీరంలో వుండదు. అంతేకాదు పైపొరల్లో విటమిన్ ఇ అనేది ఉంటుంది. ఇది త్వరగా వృద్ధాప్యం రాకుండా చేస్తుంది.
 
3. పీచు పదార్థాలు పైపొరలో వుండటం వల్ల మనం తినే తెల్లబియ్యం వలన మలబద్దకం వస్తుంది. ఎన్ని మందులు వాడినా తగ్గదు. తెల్లని బియ్యం మెతుకులు సన్నగా ఉండటం వలన సరిగా నమలకుండా మింగేస్తాము. దాని వలన జీర్ణప్రక్రియ జరగదు, అంతేకాదు దీనివలన కాళ్ళకు నీరు రావడం, తిమ్మర్లు రావడం జరుగుతుంటాయి. మనలో కొంతమంది ముడిబియ్యం అరగదనేది అపోహ మాత్రమే, మనం గోధుమలు, రాగులు, జొన్నలను కూడ వండుకుని తినవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మే 25 నుంచి రోహిణి కార్తె ప్రారంభం.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు..

రెండోసారి కూతురే పుట్టిందని 10 నెలల పసికందును హతమార్చిన కన్నతండ్రి

హైదరాబాద్‌లో వున్న పేషెంట్‌కి చైనా నుంచి ఆపరేషన్ చేసిన భారతీయ వైద్యుడు

పెనుకొండ జాతీయ రహదారి.. రెండు ట్రక్కులు ఢీ.. ట్రక్కు డ్రైవర్ సజీవ దహనం

petrol prices, లీటరు పెట్రోలు ధర విజయవాడలో రూ. 117, హైదరాబాదులో రూ. 115

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raka Fans Title: అల్లు అర్జున్ .. రాకా చిత్ర యానిమేటెడ్ టైటిల్ కు స్పందన

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ .. పంజ 4Kలో థియేటర్లలోకి తిరిగి వస్తోంది

Peddi: రామ్ చరణ్ తో ఐటెంసాంగ్ లో అలరించిన శృతి హాసన్, జాన్వీ కపూర్

హాలీవుడ్ క‌ల‌ర్స్‌ రియలిస్టిక్‌, ఇండియ‌న్ క‌ల‌ర్‌ ఎమోష‌న‌ల్‌, క‌ల్చ‌ర‌ల్లీ రిచ్‌ : కిషోర్ బోయిడాపు

Sri Satya: బిగ్ బాస్'ఫేమ్ శ్రీ సత్య ఆవిష్కరించిన విహారి OTT గ్లోబల్ విజన్

తర్వాతి కథనం
Show comments