Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధుమేహానికి మందులు అక్కర్లేదట.. ఇలా చేస్తే చాలట..

ప్రపంచంలోనే అత్యధికంగా మధుమేహ వ్యాధిగ్రస్థులు మన భారత దేశంలోనే వున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. మధుమేహం వున్నట్లైతే ఇక మందులు వాడాల్సిందేనని అందరూ ఓ నిర్ణయానికి వచ్చేస్తారు.

Webdunia
గురువారం, 7 డిశెంబరు 2017 (18:03 IST)
ప్రపంచంలోనే అత్యధికంగా మధుమేహ వ్యాధిగ్రస్థులు మన భారత దేశంలోనే వున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. మధుమేహం వున్నట్లైతే ఇక మందులు వాడాల్సిందేనని అందరూ ఓ నిర్ణయానికి వచ్చేస్తారు.

అయితే తాజాగా మధుమేహ వ్యాధిగ్రస్థులు (టైప్-2 డయాబెటిస్) మందులు వాడాల్సిన అవసరం లేదని సమతుల ఆహారంతోనే రక్తంలోని చక్కెర స్థాయులను నియంత్రించుకోవచ్చునని న్యూ క్యాజిల్, గ్లౌస్ గౌ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడి అయ్యింది. 
 
సమతుల ఆహారంతో పాటు వ్యాయామం చేయడం, బరువు తగ్గడం ద్వారా రక్తంలోని చక్కెర స్థాయులు సాధారణ స్థాయికి చేరుకుంటాయని ద లాన్ సెట్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయన వివరాల ద్వారా తెలుస్తోంది. వైద్యుల సూచనల మేరకు బరువు తగ్గిన మధుమేహ వ్యాధిగ్రస్థులు సగం మంది మందులు వాడటాన్ని నిలిపేశారు. వారు కేలరీలు తక్కువ కలిగిన ఆహారాన్ని తీసుకున్నారు. తద్వారా బరువు తగ్గారు. దీంతో 45శాతం మంది రోగులు మందులు వాడాల్సిన అవసరం తప్పిందని పరిశోధకులు రాయ్ టేటర్, మైక్ లీన్‌లు తెలిపారు.  
 
బ‌రువు త‌గ్గ‌డం వ‌ల్ల ఇన్సులిన్‌ను విడుద‌ల చేసే పాంక్రియాస్ గ్రంథిలో కొవ్వు నిల్వ‌లు క‌రిగిపోతాయ‌ని, త‌త్ఫ‌లింగా మ‌రింత ఎక్కువ ఇన్సులిన్‌ను విడుద‌ల చేసే సామ‌ర్థ్యాన్ని పాంక్రియాస్ సంత‌రించుకుంటుంద‌ని పరిశోధకులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భార్యను వదిలి హిజ్రాతో సహజీవనం... ఎవరు ఎక్కడ?

బాగా ఫేమస్ అవ్వాలి మామా.. బాగా బతికి పేరు తెచ్చుకునే ఓపిక లేదు.. బాగా చంపి ఫేమస్ అయ్యేదా... (Video)

అరెరె... ఆడబిడ్డలను రక్షించాలని వెళ్తే ద్విచక్ర వాహనం చెరువులోకి ఈడ్చుకెళ్లింది (video)

నా ప్రియుడితో నేను ఏకాంతంగా వున్నప్పుడు నా భర్త చూసాడు, అందుకే షాకిచ్చి చంపేసాం

Jagan: సినిమా చూపిస్తాం.. తప్పు చేసిన వారికి చుక్కలు ఖాయం.. యాప్ రెడీ.. జగన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

Sethupathi: సార్‌ మేడమ్‌ కోసం పరాటా చేయడం నేర్చుకున్నా : విజయ్ సేతుపతి

ప్రపంచంలో జరిగే బర్నింగ్ పాయింట్ నేపథ్యంగా థాంక్యూ డియర్

హిస్టారికల్ యాక్షన్ డ్రామా గా రిషబ్ శెట్టితో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం

చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లా? దర్శకుడు ఏమంటున్నారు

తర్వాతి కథనం
Show comments