Webdunia - Bharat's app for daily news and videos

Install App

భోజనం చేస్తూ మంచినీళ్ళు తాగుతున్నారా..?

Webdunia
శుక్రవారం, 22 మార్చి 2019 (14:53 IST)
మీకు కోపం వచ్చినప్పుడు, శరీరం ఒత్తిడికి గురైనప్పుడు, మనసు చిరాకుగా ఉన్నప్పుడు భోజనం తీసుకోవడం మంచిదికాదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యంగా ఉండడం కోసమే ఆహారం తీసుకుంటాం. ఇది శరీర ధర్మం. దీంతోబాటు వ్యాయామం కూడా కచ్ఛితంగా చేయాలంటున్నారు వైద్యులు. 
 
వయసు పెరిగేకొద్ది శరీర జీర్ణక్రియలో మార్పు వస్తుంది. కాబట్టి పెద్దవారు నడక, వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. మీరు తీసుకునే ఆహారం రుతువులనుసరించి ఉండాలి. అదికూడా నియమిత సమయానుసారం ఆహారం తీసుకుంటూ ఉండాలి. సమయం మించిపోతే భోజనం చేయకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే.. సమయం మించిపోతే ఆకలి అంతగా ఉండదు. ఒకవేళ తిన్నా ఒంటికి పట్టదు. కనుక వీలైనంత వరకు సమయానికి భోజనం చేయడం మంచిది. 
 
భోజనంతో పాటు నీళ్ళు త్రాగకండి. భోజనానికి అరగంట ముందు, అరగంట తర్వాత మాత్రమే నీళ్ళు త్రాగాలంటున్నారు ఆరోగ్యనిపుణులు. ఆకలిగా ఉన్నప్పుడు ఆహారాన్ని తీసుకోండి. ఎట్టిపరిస్థితుల్లోనూ సమయాన్ని మార్చకండి. ఇది అనారోగ్యానికి దారి తీస్తుంది. శరీరం అలసిపోయేంతవరకు పగలు పని చేయండి. దీంతో ఆకలి వేస్తుంది. నిద్రకూడా బాగా పడుతుందంటున్నారు ఆరోగ్యనిపుణులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Bhadrachalam: భద్రాచలంలో ఆరు అంతస్థుల భవనం కుప్పకూలింది: శిథిలాల కింద ఎంతమంది? (video)

పాస్‌పోర్ట్ మరిచిపోయిన పైలెట్... 2 గంటల జర్నీ తర్వాత విమానం వెనక్కి!

Tourism: తక్కువ పెట్టుబడి.. ఉద్యోగాలను సృష్టించగలదు.. ఆర్థిక వృద్ధిని పెంచగలదు.. బాబు

అత్తపై కన్నేసిన కామాంధుడు, కోర్కే తీరేలా చేయంటూ భార్యపై ఒత్తిడి, చివరికి...

Wife: భార్యను గొంతుకోసి చంపేసిన క్యాబ్ డ్రైవర్.. ఆపై లొంగిపోయాడు.. కారణం ఏంటంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంతాన ప్రాప్తిరస్తు నుంచి విక్రాంత్, చాందినీ చౌదరి ల రొమాంటిక్ సాంగ్

ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా బైలింగ్వల్ చిత్రం

Nitin: సోలోడేట్ లోనే రాబిన్‌హుడ్ అనుకున్నాం, కానీ పోటీ తప్పదనే రావాల్సివచ్చింది : చిత్ర టీమ్

Warner: క్రికెట్‌లో స్లెడ్జింగ్‌ కంటే ఆ కామెంట్స్ పెద్దవేమీ కాదు.. లైట్‌గా తీసుకున్న వార్నర్.. వెంకీ

'కన్నప్ప'కు పోటీగా 'భైరవం' - వెండితరపైనే చూసుకుందామంటున్న మనోజ్!!

తర్వాతి కథనం
Show comments