Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీడిపప్పు టేస్ట్‌గా వున్నాయని అధికంగా తింటే ఏమవుతుందో తెలుసా?

Webdunia
శనివారం, 13 ఫిబ్రవరి 2021 (19:58 IST)
జీడిపప్పు కనబడితే చాలు గబుక్కున నోట్లో వేసుకుని పరపరమంటూ నమిలేయాలనిపిస్తుంది. ఐతే పచ్చివి తినడం కంటే వాటిని వేయించుకుని తింటే మంచిదని నిపుణులు చెపుతున్నారు. ఇకపోతే జీడిపప్పులో అధిక ఆక్సలేట్ కంటెంట్ ఉంటుంది. ఎక్కువ పరిమాణంలో తిన్నప్పుడు, ఇవి మూత్రపిండాలపై ప్రభావం చూపి నష్టం కలిగిస్తాయి. అంతేకాదు ఇవి ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం లేకపోలేదు. ముడి జీడిపప్పు అసురక్షితమైనవి, ఐతే కాల్చిన జీడిపప్పు మరింత రుచికరమైనదే కాకుండా అవి సురక్షితమైనవి కూడా.
 
జీడిపప్పుతో ప్రయోజనాలు
జీడిపప్పులో సున్నా కొలెస్ట్రాల్ ఉంటుంది. కనుక గుండెకు ఎలాంటి హాని చేయదు. మెగ్నీషియం నిల్వలు కూడా అధికంగా ఉండటంతో ఎముకలు పుష్టికి ఇవి దోహదపడుతాయి. మన శరీరానికి సుమారు 300 నుంచి 750 మిల్లీగ్రాముల మెగ్నీషియం అవసరమవుతుంది కనుక కాజు తీసుకుంటే మేలు.
 
ఇక రక్తపోటు(బీపి) ఉన్నవారు కూడా జీడిపప్పును తినేందుకు భయపడాల్సిన పనిలేదు. ఇందులో సోడియం శాతం తక్కువగానూ పొటాషియం నిల్వలు ఎక్కువగా ఉంటాయి.
 
కేన్సర్ సమస్యను అడ్డుకునే యాంటి ఆక్సిడెంట్లను జీడిపప్పు కలిగి ఉంది. సెలీనియమ్, మరియు విటమిన్ ఇ వంటివి ఉండటంతో ఇవి కేన్సర్ ను రాకుండా అడ్డుకుంటాయి.
 
ఐతే తినమన్నాం కదా అని ఎడాపెడా తినేయకూడదు. నియంత్రణ ఉండాలి. రోజుకు 5 నుంచి 10 వరకూ మాత్రమే జీడిపప్పులను తీసుకోవచ్చు. ఇదికూడా రెండు దఫాలుగా తింటే మంచిది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Future City: ఫ్యూచర్ సిటీ, అమరావతిని కలిపే హై-స్పీడ్ రైలు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారటగా!

Hyderabad: తెలంగాణలో భారీ వర్షాలు- టెక్కీలు వర్క్-ఫ్రమ్-హోమ్ అనుసరించండి..

Two Brides: ఇద్దరు మహిళలను ఒకేసారి పెళ్లి చేసుకున్న వ్యక్తి.. వైరల్ వివాహం..

ఫ్రిజ్‌లో పెట్టుకున్న మటన్ వేడి చేసి తిన్నారు, ఒకరు చనిపోయారు

పవన్ తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా? జనసేనాని ఏమన్నారు? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

తర్వాతి కథనం
Show comments