Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాత్రి భోజనం... ఇవి తెలుసుకోండి...

రాత్రి 7 గంటలపైన భోజనం చేయడం వల్ల అధిక బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయని చాలామంది రాత్రుల్లో భోజనం మానేసి పడుకుంటారు. అయితే వేళకు సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల అది నిద్ర వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలను రాత్రి వేళల్లో తీసుకో

Webdunia
గురువారం, 27 సెప్టెంబరు 2018 (16:18 IST)
రాత్రి 7 గంటలపైన భోజనం చేయడం వల్ల అధిక బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయని చాలామంది రాత్రుల్లో భోజనం మానేసి పడుకుంటారు. అయితే వేళకు సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల అది నిద్ర వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలను రాత్రి వేళల్లో తీసుకోకపోవడమే మంచిదని, ఒకవేళ తీసుకున్నట్లయితే అవి శరీర సమతుల్యతను దెబ్బతీస్తాయని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. జిడ్డుగా ఉండే పదార్థాలు, వంటనూనె అధికంగా ఉండే ఆహార పదార్థాలు, ఫ్రిజ్‌లో నిల్వ ఉంచినవి, పెరుగు లేదా ఐస్‌క్రీమ్ వంటివి రాత్ర్రి వేళల్లో తినకూడదు. అలా తినాల్సి వచ్చిన పక్షంలో కొద్దిగా మాత్రమే తినాలి.
 
మరికొన్ని ఆయుర్వేద చిట్కాలను తెలుసుకుందాం:
 
1. పెరుగు తినడం మానెయ్యండి - రాత్రి వేళల్లో పెరుగు తినడం వలన అది జలుబు, దగ్గును అధికం చేస్తుంది.
2. భోజనానంతరం ఎక్కువ నీరు త్రాగకండి. అయితే ఒక గంట తర్వాత కొద్దిగా వేడి నీరు తీసుకోండి. ఆ నీరు త్రాగడం వలన జీర్ణశక్తిని మెరుగుపరచడమే కాకుండా గ్యాస్ సమస్యలను తగ్గిస్తుంది.
3. పసుపు వేసిన పాలను త్రాగండి- పసుపు వేసిన పాలను త్రాగడం వలన కఫం రాకుండా చేస్తుంది, బ్యాక్టీరియాని తగ్గించడంతోపాటు బాగా నిద్ర పట్టేలా చేస్తుంది.
4. చక్కెర అధికంగా ఉండే కేక్‌లు, కుకీలు తినకండి. ముఖ్యంగా చక్కెరకు బదులుగా తేనెను వాడడం వల్ల అది కూడా కఫం రాకుండా చేస్తుంది, అలాగే బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది.
5. దాల్చిన చెక్క, పెద్దజీలకర్ర (సోంపు), మెంతులు మరియు ఏలకులను ఉపయోగించడం ద్వారా ఆహారాన్ని రుచిగా మార్చడమే కాక శరీరంలో వెచ్చదనాన్ని పెంచుతాయి మరియు శరీర బరువును తగ్గించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి.
6. పచ్చి సలాడ్‌లను రాత్రుల్లో తినవద్దు, ప్రొటీన్లు అధికంగా ఉండే పప్పు ధాన్యాలు, బ్రోకోలీ వంటివి తీసుకోవడం వల్ల మీ కొవ్వు నిల్వలను కరిగించడంలో సహాయపడతాయి.
7. ఉప్పు వాడకం బాగా తగ్గించండి, అందువల్ల హృదయ సంబంధ వ్యాధులు, రక్తపోటు మరియు అకాల మరణం కలగకుండా ఉంటుంది.
8. ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకోవడం వలన జీర్ణమయ్యేందుకు కష్టతరంగా మారుతుంది. అందుకే మితాహారం తీసుకోండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పుల్లెల గోపీచంద్ అకాడమీలో తమ సరికొత్త క్లినిక్‌ను ప్రారంభించిన వెల్నెస్ కో

ప్రియురాలుని బైక్ ట్యాంక్ పైన పడుకోబెట్టి వేగంగా నడుపుతూ యువకుడు రొమాన్స్ (video)

హైద‌రాబాద్‌లో నేష‌న‌ల్ హెచ్ఆర్‌డీ నెట్‌వ‌ర్క్ అత్యాధునిక కార్యాల‌యం

ఆ ఐదు పులులు ఎందుకు చనిపోయాయంటే...

ఎయిరిండియా విమాన ప్రమాదం - దర్యాప్తు అధికారికి ఎక్స్ కేటగిరీకి భద్రత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

తర్వాతి కథనం
Show comments