Webdunia - Bharat's app for daily news and videos

Install App

యవ్వనంగా వుండాలా? మెట్లెక్కాల్సిందే..

రోజుకు ఒకటి లేదా రెండు సార్లు మెట్లెక్కితే చాలు.. ఎముకలు బలపడతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మెనోపాజ్‌ వల్ల సహజంగానే ఎముకలు బలహీనపడే అవకాశం ఉంది కనుక, కండరాలను పుష్టిగా మార్చుకోవాలంటే.. రోజుకు ర

Webdunia
శనివారం, 9 జూన్ 2018 (11:03 IST)
రోజుకు ఒకటి లేదా రెండు సార్లు మెట్లెక్కితే చాలు.. ఎముకలు బలపడతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మెనోపాజ్‌ వల్ల సహజంగానే ఎముకలు బలహీనపడే అవకాశం ఉంది కనుక, కండరాలను పుష్టిగా మార్చుకోవాలంటే.. రోజుకు రెండుసార్లు మెట్లెక్కాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మెనోపాజ్ వల్ల కలిగే దుష్పరిణామాల్లో రక్తపోటు సమస్య తలెత్తుతుంది. 
 
కండరాల పనితనం కుంటుపడుతుంది. వీటన్నింటికి విరుగుడుగా మెట్లు ఎక్కే వ్యాయామం పనిచేస్తుంది. ఎందుకంటే దీనిద్వారా ఏరోబిక్‌, రెసిస్టెన్స్‌ వ్యాయామాల ఫలితాలు కూడా కలుగుతాయి. ఇవి గుండెకు ఆక్సిజన్‌ను చేరవేసే జీవక్రియను మెరుగుపరుస్తాయి. వీటికి తోడు మెట్లు ఎక్కడం ద్వారా వార్థక్యం సమస్యలను కూడా చాలా వరకు నియంత్రించవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
అలాగే పోషకాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. తృణధాన్యాలు, ముడిబియ్యం, రాగి, బార్లీ, జొన్న, ఓట్స్ వంటి చిరుధాన్యాలు రుచికరంగా ఉండడమే కాకుండా ఎన్నో పోషక విలువలు కలిగి ఉంటాయి. వీటిని ఆహారంలో చేర్చితే బరువు తగ్గడం, మధుమేహాన్ని నియంత్రించుకోవచ్చునని ఆరోగ్య నిపుణలు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments