ఇంటిపట్టునే ఆక్సిజన్ పల్స్ చెక్ చేసుకోవడం ఎలా?

Webdunia
గురువారం, 22 ఏప్రియల్ 2021 (10:58 IST)
కరోనా వైరస్ సోకిన రోగుల్లో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయి. ఈ కారణంగానే చాలా మంది మృత్యువాతపడుతున్నారు. అయితే, కరోనా వైరస్ సోకి, ఇంటిపట్టునే చికిత్స తీసుకుంటున్న వారు ఆక్సిజన్ లెవెల్స్‌ను చెక్ చేసుకుంటూ ఉండాలి. అది ఎలా చేసుకోవాలో ఓసారి తెలుసుకుందాం. 
 
కరోనా పాజిటివ్‌ వచ్చినా, లక్షణాలులేకుండా హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంటున్న వారు పల్స్‌ ఆక్సీమీటర్‌ (ఫింగర్‌ డివైజ్‌)ను కొనుగోలు చేసుకోవాలి. కరోనా సోకని వారూ వీటిని కొనుగోలు చేసుకుని భద్రపరుచుకోవచ్చు. పల్స్‌ ఆక్సీమీటర్‌ను వేలికి పెట్టుకుంటే పల్స్‌తోపాటు రక్తంలో ఆక్సిజన్‌ ఎంతుందో ఇది సూచిస్తుంది. 
 
ప్రతి వ్యక్తికి రక్తంలో ఆక్సిజన్‌ 100 శాతం ఉండాలి. 95 శాతం వరకూ సాధారణంగా, 90-95 శాతం మధ్యలో ఉంటే మోడరేట్‌గా, 90 శాతం కన్నా తక్కువ ఉంటే ప్రమాదకరంగా భావించి ఆస్పత్రిలో చేరి చికిత్స పొందాల్సి ఉంటుంది. 97 శాతం ఆక్సిజన్‌ ఉన్నప్పుడు ఆరు నిమిషాలు నడిచిన తర్వాత ఐదు శాతం కంటే ఎక్కువ (92శాతం కంటే) తగ్గితే ఆస్పత్రిలో చేరాల్సి ఉంటుంది. 
 
కరోనా రోగులకు మూడు శాతం తగ్గినా చికిత్స పొందాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇక పల్స్‌ 70 నుంచి 100 మధ్యలో ఉంటే సాధారణంగా భావిస్తారు. 60 కంటే తక్కువ ఉంటే హార్ట్‌ రేటింగ్‌ తగ్గిందని, 100 కంటే ఎక్కువగా ఉంటే పెరిగినట్లు పరిగణిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రైతులకు రుణమాఫీ.. రోజుకు ఐదు సినిమా షోలు.. సీఎం విజయ్

నిప్పుల కుంపటిగా ఆంధ్రప్రదేశ్ - భానుడి ప్రతాపానికి తల్లడిల్లిపోతున్న జనం

పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం.. పార్టీ కార్యవర్గం రద్దు

మద్యం సేవించి ఇంటికొచ్చి గొడవ... భర్తను చున్నీతో చంపేసిన భార్య .. ఎక్కడ?

కాంతి రేఖలా ఇండియా పాకిస్థాన్ సరిహద్దు.. వీడియోను షేర్ చేసిన ఇండిగో పైలెట్ (వీడియో)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అతని కోసం పెద్ది చిత్రంలో నటించాలని నిర్ణయం తీసుకున్నా : దివ్యేందు శర్మ

M.M. Keeravani: లవ్ స్టోరీలో ఏడు పాటలు ఉంటాయంటే బ్లాక్ బస్టర్ : ఎంఎం కీరవాణి

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

Trisha: ఇప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకుంటున్న త్రిష? ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments