Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేడివేడి బజ్జీలొద్దు.. వేడివేడి సూప్‌లు ట్రై చేయండి..

వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవాలంటే.. అల్లం, పసుపును వంటల్లో అధికంగా వాడాలి. అల్లంతో చేసిన టీ తాగడం లేదంటే పసుపు కలిపిన పాలు రోజూ తీసుకోవడం ద్వారా దగ్గు, జలుబు దూరం అవుతాయి. అలాగే మొలకలూ, మొక్

Webdunia
సోమవారం, 16 జులై 2018 (11:44 IST)
వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవాలంటే.. అల్లం, పసుపును వంటల్లో అధికంగా వాడాలి. అల్లంతో చేసిన టీ తాగడం లేదంటే పసుపు కలిపిన పాలు రోజూ తీసుకోవడం ద్వారా దగ్గు, జలుబు దూరం అవుతాయి. అలాగే మొలకలూ, మొక్క జొన్న గింజలు కూడా ఈ కాలంలో ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో పీచు పుష్కలంగా ఉంటుంది. చాట్‌లాగా లేదంటే సలాడ్‌లాగా చేసుకుని తింటే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. 
 
అలాగే వేడివేడి బజ్జీలు, పకోడీల కంటే వేడివేడి సూపులను తీసుకోవడం ద్వారా శరీరానికి మేలు చేకూరుతుంది. వాటిలో ఎక్కువగా అల్లం, వెల్లుల్లి, మిరియాలు ఉండేలా చూసుకుంటే అనారోగ్య సమస్యలు దరిచేరవు. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. 
 
ఇంకా టొమాటో, క్యారెట్‌, పుట్టగొడుగుల్లాంటివి కేవలం కూరల్లో చేర్చుకోవడమే కాకుండా ఆవిరి మీద ఉడికించి తినాలి. అప్పుడే వాటిలోని పోషకాలు శరీరానికి అందుతాయి. వాటిని నేరుగా తినలేకపోతే ముక్కలుగా చేసి సలాడ్‌లాగా చేసుకుని తీసుకోవచ్చు. ఇలా చేస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని అనారోగ్య సమస్యలు ఏమాత్రం అంటవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments