Webdunia - Bharat's app for daily news and videos

Install App

మామిడి పండ్లను ఇలా తింటే వేడి చేయదట?

Webdunia
బుధవారం, 22 మే 2019 (13:06 IST)
వేసవి వచ్చిందంటే చాలు మామిడి పండ్ల ప్రియులకు పండుగే. నోరూరించే ఈ ఫలరాజులో పోషకాలు బోలెడన్ని ఉంటాయనే సంగతి అందరికీ తెలిసిందే. ఓ వైపు మామిడి పండ్లు నోరూరిస్తున్నప్పటికీ... వేడి చేస్తుందని భయపడి చాలా మంది మామిడి పండ్లు తినడానికి వెనుకంజ వేస్తూంటారు. 
 
కానీ రోజుకు ఒకటి లేదా రెండు మామిడి పండ్లను తినడం ద్వారా వేసవి తాపం నుండి తప్పించుకోవచ్చని న్యూట్రిషనిస్టులు చెప్తున్నారు. మామిడి పండ్లలో క్యుర్సెటిన్, ఫిసెటిన్, ఐసోక్యూరెసిట్రిన్, ఆస్ట్రాగాలిన్, గాలిక్ యాసిడ్, మిథైల్ గాలెట్ వంటి పలు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. 
 
మామిడి పండ్లు వేసవిలోని వేడిమి కారణంగా సహజంగా ఏర్పడే అలసట, డీహైడ్రేషన్ వంటి సమస్యలను తగ్గిస్తాయి. ఆహారాన్ని మితంగా తీసుకోవాలనుకునేవాళ్లు మామిడి పండ్లు తింటే త్వరగా ఆకలేయదనీ, కడుపు నిండిన భావన కలుగుతుందని కూడా న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. ముక్కలుగా కోసి మిక్సీలో వేసుకొని స్మూతీగానూ మామిడి రుచులను ఆస్వాదించవచ్చు.
 
మామిడి పండ్లను తినడం వల్ల శరీరానికి వెంటనే శక్తి అందడంతో రోజంతా ఉత్సాహంగా ఉంటారు. వీటిలో విటమిన్ ఎ, ఐరన్, కాపర్, పొటాషియం అధిక మోతాదుల్లో ఉంటాయి. మామిడి పండులో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. వీటిని ఉదయం, సాయంత్రం వేళల్లో తినడం వల్ల శరీరంలో కేలరీలు పేరుకుపోకుండా ఉంటాయి.
 
మామిడి పండ్లు తింటే బరువును పెరుగుతామనీ, వేడి చేస్తుందనీ చాలా మంది భావిస్తారు... కానీ రోజుకు ఒకటి లేదా రెండు మామిడి పండ్లను బేషుగ్గా లాగించేస్తే ఎలాంటి ఇబ్బందీ ఉండదంటున్నారు. మామిడి పండులో ఉండే చక్కెరలు, పీచు శరీరానికి మేలు చేస్తాయి. అప్పటికీ వేడి చేస్తుందనే భయం ఇంకా మీ మనసులో ఉంటే రాత్రి పడుకునే ముందు మామిడి పండ్లను నీళ్లల్లో వేసి.. ఉదయాన్నే తినండి. ఇలా చేయడం వల్ల అస్సలు వేడి చేయదు.

సంబంధిత వార్తలు

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments