Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్షాకాలంలో తీసుకోవలసిన ఆహార పదార్థాలివే..?

Webdunia
శుక్రవారం, 2 నవంబరు 2018 (16:36 IST)
వర్షాకాలం వస్తేనే చాలు.. అందరు అనారోగ్య సమస్యలో బాధపడుతుంటారు.. శరీరంలో వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉండడమే ఇందుకు కారణం. కనుక ఏ ఆహార పదార్థాలు తీసుకుంటే ఆ శక్తి పెరుగుతుందో తెలుసుకుందాం..
 
వెచ్చని పానీయాలు తీసుకోకుండా.. టీ, కాఫీలకు బదులుగా గ్రీన్ టీ, బ్లాక్ టీ, హెర్బల్ టీ వంటివి తీసుకోవాలి. దాంతో పాటు అల్లం, మిరియాలు, తేనెతో తయారుచేసిన టీ సేవిస్తే.. వర్షాకాలంలో ఆరోగ్యానికి చాలా మంచిది. పుదీనా, తులసి ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తి పెంచుతాయి. 
 
రాగులు, సోయాబీన్, పెసలు, మెుక్కజొన్న వంటి పప్పుధాన్యాలను ఆహారంగా భాగంగా చేసుకుంటే ఈ కాలంలో ఎలాంటి అనారోగ్య సమస్యలలో బాధపడరు. కారం ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకుంటే శరీర ఉష్ణోగ్రతను పెంచి రక్తప్రసరణను ఉత్తేజపరుస్తుంది. దీనివలన శరీరంలో అలర్జీలు వ్యాపిస్తాయి. కనుకు వీలైనంత వరకు కారం తిండి పదార్థాలు తీసుకోకండి..
 
ఇక ఐస్‌క్రీమ్స్ విషయాలకు వస్తే.. చలికాలంలో ఐస్‌క్రీమ్స్ అధికంగా తీసుకోవడం అంత మంచిది కాదు. ఒకవేళ తీసుకుంటే జలుబు వస్తుంది. దాంతో పాటు దగ్గు ఏర్పడి గొంతునొప్పి వస్తే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఫ్రిజ్ వాటర్ వాడడం కూడా మానేయాలి. ఇప్పుడు కూరగాయలు, పండ్లు.. పోషక విలువలు ఎక్కువగా ఉండే వాటిని తీసుకోవాలి.. అంటే.. దానిమ్మ, ఆపిల్, స్ట్రాబెర్రీ, అరటి. ఇక కూరగాయలు.. క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బచ్చలికూర వంటివి తీసుకుంటే మంచిది.   

సంబంధిత వార్తలు

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

తర్వాతి కథనం
Show comments