Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలు పితికిన వెంటనే తీసుకుంటున్నారా.. జాగ్రత్త.?

Webdunia
శనివారం, 8 డిశెంబరు 2018 (13:00 IST)
ఆవు పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ వంటి ఖనిజాలు శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి. దాంతో పాటు శరీరానికి అవసరమైన పదార్థాలను అందిస్తాయి. ప్రతిరోజూ గ్లాస్ ఆవు పాలు తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. ఇంకా చెప్పాలంటే బరువు తక్కువగా ఉన్నవారికి ఈ పాలు మంచి టానిక్‌లా పనిచేస్తాయి. ఇన్ని లాభాలిచ్చే పాలను పచ్చిగా తీసుకుంటే మంచిదో కాదో తెలుసుకుందాం...
 
అప్పుడే పితికిన ఆవు పాలు తాగితే ఆరోగ్యానికి మంచిదని అందరు అనుకుంటారు. కానీ ఇది తప్పు అంటున్నారు పరిశోధకులు. పచ్చిపాలు బాగా వేడిచేయకుండా తాగినప్పుడు వాటిలోని బ్యాక్టీరియా మన శరీరంలోకి చేరుతుంది. తద్వారా క్షయ, టైఫాయిడ్‌ వంటి వ్యాధులు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నాయని వారు హెచ్చరిస్తున్నారు. 
 
పచ్చిపాల మీద ఉండే మీగడ, వెన్న కూడా ఆరోగ్యానికి హాని చేస్తాయట. పాలను అధిక ఉష్ణోగ్రత వద్ద కనీసం పదిహేను నుంచి ఇరవై సెకన్ల పాటు బాగా మరిగించిన తర్వాతే వాటిని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పసిపిల్లలకు ఇచ్చే పాలను మరింత ఎక్కువ సమయం మరిగించాలనీ, అప్పుడే వాటిలోని బ్యాక్టీరియాలు నశిస్తాయని కూడా అంటున్నారు. అప్పుడే ఆరోగ్యానికి మంచిదని అంటున్నారు. కనుక వీలైనంత వరకు పచ్చిపాలు తీసుకోవడం మానేస్తే మంచిది. 

సంబంధిత వార్తలు

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

తర్వాతి కథనం
Show comments