భార్యాభర్తలు తరచూ గొడవలు, ఆ రోగాలు ఖాయం

Webdunia
బుధవారం, 4 మార్చి 2020 (22:12 IST)
కుటుంబం అన్న తరువాత ఏదో ఒక విషయంలో గొడవలు ఉంటాయి. అయితే ఆ గొడవలు పరిష్కరించకుంటే సరిపోతుంది కానీ తెగే దాకా లాగి తరచూ గట్టిగా అరుచుకోవడం.. తరచూ ఘర్షణ వాతావరణం నెలకొనే విధంగా ప్రవర్తిస్తే మాత్రం ఖచ్చితంగా కొన్ని రోగాలను కొని తెచ్చుకున్నట్లేనంటున్నారు వైద్య నిపుణులు.
 
భార్యాభర్తలు కనుక తరచూ గొడవ పడుతుంటే మోకాళ్ళ నొప్పులు, మధుమేహం వంటివి పెరిగే అవకాశం ఉందంటున్నారు. దీన్ని ధృవీకరిస్తోంది అమెరికాలోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం. రెండునెలల నుంచి వీరు శోధించి ఈ విషయాన్ని నిర్ధారించారట.
 
అంతేకాదు వైవాహిక జీవితంలోని సంతోషం ఆరోగ్యంపై అనుకూల ప్రభావం చూపుతుందని.. భార్యాభర్తలు ఘర్షణ పడితే మాత్రం కలిగే మానసిక వేదన వల్ల నొప్పులు మరింత ఎక్కువ అవుతాయని అధ్యయనంలో గుర్తించారట.
 
పంతాలు, పట్టింపులకు స్వస్తి చెప్పి ఆనందంగా గడిపితే ఆరోగ్యం బాగుంటుందని..లేకుంటే అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఏర్పడుతుందంటున్నారు. అది కూడా 30 యేళ్ళు దాటిన వారిలోను ఈ వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని నిర్ధారణకు వచ్చారట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వ్యక్తులు రావచ్చు, పోవచ్చు, కానీ టీడీపీ శాశ్వతంగా ఉంటుంది.. నారా లోకేష్

PM Modi Gifts to Putin: పుతిన్‌కు భగవద్గీతను బహూకరించిన ప్రధాని మోదీ

IndiGo: ఇండిగో విమానాల రద్దు.. కేంద్రాన్ని ఏకిపారేసిన రాహుల్ గాంధీ

అర్థరాత్రి మహిళను లాక్కెళ్లి గ్రామ సచివాలయంలో అత్యాచారం

సీబీఐ కేసును కొట్టివేయాలి.. వై. శ్రీలక్ష్మి పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ఆదేశాలు రిజర్వ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: కృతి స‌న‌న్ తో ప్రేమలో మోసపోయాక యుద్ధమే అంటున్న ధనుష్ - అమ‌ర‌కావ్యం (తేరే ఇష్క్ మై)

అఖండ 2 డిసెంబర్ 12న వస్తోందా నిర్మాతలు ఏమన్నారంటే?

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

తర్వాతి కథనం
Show comments