Webdunia - Bharat's app for daily news and videos

Install App

వడదెబ్బకు విరుగుడు.. ఎండు ఖర్జూరాన్ని రాత్రంతా నీటిలో నానబెట్టి?

ఎండల్లో తిరుగుతున్నారా? అయితే తీసుకునే ఆహారంలో జాగ్రత్త పాటించండి. నీరు ఎక్కువ తాగండి. నీటి శాతం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోండి.. అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వడదెబ్బ తగలకుండా ఉండాలంటే.. గ్లాసుడు నీళ

Webdunia
బుధవారం, 26 ఏప్రియల్ 2017 (11:56 IST)
ఎండల్లో తిరుగుతున్నారా? అయితే తీసుకునే ఆహారంలో జాగ్రత్త పాటించండి. నీరు ఎక్కువ తాగండి. నీటి శాతం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోండి.. అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వడదెబ్బ తగలకుండా ఉండాలంటే.. గ్లాసుడు నీళ్ళలో ఎండు ఖర్జూరాన్ని రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే పిప్పి తీసేసి ఆ నీటిని తాగితే సరిపోతుంది.  
 
అలాగే ఆహారంలో పుదీనాను చేర్చుకోవడం ద్వారా వేసవిలో శరీరానికి మంచిది. పుదీనాను ఆహారంలో తీసుకోవడం ద్వారా మొటిమలను దూరం చేసుకోవచ్చు. గ్లాసు నీళ్లలో పుదీనా ఆకుల్ని... వేసి మరిగించాలి. ఈ నీళ్లని వడకట్టి... అందులో తేనె చేర్చి తీసుకున్నా ఫలితం ఉంటుంది. వేడి ప్రభావం తగ్గించుకోవాలంటే, తప్పనిసరిగా కనీసం రోజుకో కీరదోసకాయను తినాలి. కీరా ముక్కలు తినడం వల్ల శరీరం డీహైడ్రేషన్‌ బారిన పడదు. అలానే కొబ్బరి నీళ్లు... చెరకురసం, బార్లీ నీటిని కూడా తీసుకోవచ్చు. ఇంకా వేసవిలో నీరసం, అలసటను దూరం చేసుకోవాలంటే.. రోజూ పుచ్చకాయ తినాలి. 
 
ఎండలో బయటకు వెళ్లి వచ్చాక నీళ్లకి బదులు నిమ్మరసం తీసుకోవాలి. ఈ రసంలో చక్కెరకు బదులు తేనె చేర్చాలి. చల్లని పాలలో...చాక్లెట్‌, స్ట్రాబెర్రీ, కమలా ఫలం వంటివి ఏదో ఒకటి చేర్చి మిక్సీ చేయాలి. ఇలా తయారైన స్మూతీలో కాస్త తేనె చేర్చి ఉదయం పూట తీసుకుంటే ఎండ ప్రభావం మన మీద పడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

పాకిస్తాన్ 2 ముక్కలు, స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ప్రకటన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

తర్వాతి కథనం
Show comments