Webdunia - Bharat's app for daily news and videos

Install App

చర్మానికి మేలు చేసే డార్క్ చాక్లెట్: వంటల్లో ఓ చెంచా కొబ్బరినూనె వాడితే?

చర్మానికి మేలు చేయాలంటే.. డార్క్ చాక్లెట్ తినండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లూ, ఫ్లేవనాయిడ్లు, ఫ్యాటీయాసిడ్లు ఆరోగ్యానికే కాకుండా చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఉండే కో

Webdunia
బుధవారం, 26 ఏప్రియల్ 2017 (11:25 IST)
చర్మానికి మేలు చేయాలంటే.. డార్క్ చాక్లెట్ తినండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లూ, ఫ్లేవనాయిడ్లు, ఫ్యాటీయాసిడ్లు ఆరోగ్యానికే కాకుండా చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఉండే కోకో రక్తప్రసరణపై సానుకూల ప్రభావాన్ని చూపడం వల్ల పరోక్షంగా చర్మానికి మేలు జరుగుతుంది. అలాగే డార్క్‌ చాక్లెట్‌లోని పోషకాలు అతినీలలోహిత కిరణాల వల్ల చర్మానికి కలిగే హానిని అడ్డుకుంటాయి కూడా. అలాగని అతిగా తింటే మాత్రం మొటిమలతోపాటూ, అధికబరువూ పెరిగే ప్రమాదం కూడా ఉంటుంది.
 
అలాగే ముఖంపై ముడతలను నివారించుకోవాలంటే.. ఎరుపు రంగు క్యాప్సికంను పచ్చిగా సలాడ్‌ రూపంలో కూడా తీసుకోవచ్చు. ఇందులో సి, బి6 విటమిన్లూ, పీచు, కెరొటినాయిడ్లూ ఉంటాయి. ఈ పోషకాలన్నీ ముడతల్ని నివారిస్తాయి. అదే సమయంలో మొటిమలు రాకుండా అడ్డుకోవడమే కాదు, రక్తప్రసరణ కూడా బాగా జరిగేలా చేస్తాయి. తరచూ దీన్ని తీసుకోగలిగితే వార్థక్యపు ఛాయలు చాలామటుకూ దూరం అవుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
కొబ్బరినూనె వంటల్లో చెంచా వాడటం ద్వారా ఇన్ఫెక్షన్లను దూరం చేసుకోవచ్చు. కొబ్బరి నూనెలో కెలొరీలు ఎక్కువైనా, లారిక్‌ యాసిడ్‌ సమృద్ధిగా ఇందులో ఉంటుంది. దీనికి యాంటీబ్యాక్టీరియల్‌, యాంటీవైరల్‌ గుణాలు ఉంటాయి. వంటల్లో కొన్ని చెంచాల నూనె వాడినా ఇన్‌ఫెక్షన్లూ, కొన్నిరకాల వైరస్‌లూ దరిచేరవు. విటమిన్‌ ఇ గుణాలు చర్మాన్ని మృదువుగా మారుస్తాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

పాకిస్తాన్ 2 ముక్కలు, స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ప్రకటన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

తర్వాతి కథనం
Show comments