కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు ఉపయోగిస్తున్నారా? అలసట తప్పదండోయ్

శారీరక శ్రమ ద్వారా అలసట ఆవహిస్తుందని అందరూ అనుకుంటారు. అయితే వాస్తవానికి మూడు కిలోమీటర్లు పరిగెత్తడంతో ఏర్పడే అలసట కంప్యూటర్ ముందు కూర్చుని కొన్ని మెయిల్స్ పంపడం ద్వారా ఏర్పడుతుందని తాజా పరిశోధనలు తేల

Webdunia
బుధవారం, 29 నవంబరు 2017 (12:48 IST)
శారీరక శ్రమ ద్వారా అలసట ఆవహిస్తుందని అందరూ అనుకుంటారు. అయితే వాస్తవానికి మూడు కిలోమీటర్లు పరిగెత్తడంతో ఏర్పడే అలసట కంప్యూటర్ ముందు కూర్చుని కొన్ని మెయిల్స్ పంపడం ద్వారా ఏర్పడుతుందని తాజా పరిశోధనలు తేల్చాయి. కంప్యూటర్ ముందు కూర్చున్నా.. శారీరక శ్రమకు సంబంధించిన పనులు చేసినా మెదడు, గుండె పనితీరు ఒకే విధంగా వుంటుందని అమెరికా పరిశోధకులు తేల్చారు. 
 
కంప్యూటర్ల ముందు కూర్చున్నా బస్తాలు మోసినా గుండె ఒకే రీతిలో ఆట్రినల్ ఉత్పత్తి చేస్తుంది. ఇక సెల్ ఫోన్‌ను గంటల పాటు ఉపయోగించే వారికి శారీరక శ్రమ కంటే మెదడు పనితీరు అధికంగా వుంటుంది. ముఖ్యంగా శరీరానికి కావలసిన ఆక్సిజన్ కంటే 20 రెట్లు అధికమైన ఆక్సిజన్ మెదడుకు అవసరమవుతుంది. కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ల ఉపయోగం ద్వారా వాటిలోని ఎలక్ట్రానిక్ వేవ్స్ శరీరానికి అలసటను ఇస్తాయట. ఈ అలసట బరువు ఎత్తడం వంటి ఇతరత్రా శారీరక శ్రమ చేసిన వారికంటే అధికమని అమెరికా పరిశోధకులు చెప్తున్నారు. 
 
ఇలా గంటల పాటు కూర్చుని కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లను ఉపయోగించడం ద్వారా ఏర్పడే అలసటను Computer fatigue అంటున్నారు. కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లను ఉపయోగించడం ద్వారా ఒకేచోట కూర్చోవడం చేస్తారు. తద్వారా కండరాలు బిగుతుగా తయారవుతాయి. దీంతో వెన్నునొప్పి, మెడనొప్పి, కంటిపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ కారణాలు రక్తపోటు, ఒబిసిటీ, మధుమేహం వంటి రుగ్మతలకు దారితీస్తాయి. 
 
ఇంకా కంప్యూటర్ నుంచి స్మార్ట్ ఫోన్ల నుంచి విడుదలయ్యే కిరణాల ప్రభావం మెదడుపై పడుతుంది. దీంతో మానసిక ఒత్తిడి తప్పదు. కంటికి దృష్టి లోపాలు తప్పవు. నిద్రలేమి కలుగుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.  కాబట్టి శారీరక, మానసిక ఇబ్బందులకు గురిచేసే కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లను తదేకంగా ఉపయోగించకుండా.. అవసరానికి మాత్రమే ఉపయోగించడం ద్వారా అనారోగ్య సమస్యల నుంచి గట్టెక్కవచ్చునని పరిశోధకులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నకిలీ స్టాక్ ట్రేడింగ్ - రూ.85 లక్షల వరకు మోసపోయిన హైదరాబాదీ

తెలంగాణ టూరిజంకు రూ.146.50 కోట్లు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం

హనీమూన్ మర్డర్ కేసు తరహాలో పెళ్లైన మూడు నెలలకే భర్తను చంపేసిన కిలేడి

SIR begins in Telangana: తెలంగాణలో ఎస్ఐఆర్ కోసం సన్నాహక పనులు ప్రారంభం

MBBS Student: హాస్టల్ గదిలో మృతి చెందిన ఎంబీబీస్ స్టూడెంట్.. ఏమైంది?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలిసినవారికి వివరణ అవసరం లేదు, చెప్పినా వినరు : ఏఆర్ రెహమాన్

ప్రభాస్ ఖాతాలో అరుదైన రికార్డ్: జపాన్ అనాన్‌పై సోలోగా రెబల్ స్టార్

మన శంకర వర ప్రసాద్ గారు జీ5లో స్ట్రీమింగ్ కు వచ్చేస్తోంది

సంగీత్ శోభన్ హీరోగా నిహారిక కొణిదె నిర్మిస్తోన్న రాకాస డేట్ ఫిక్స్

మీర్జాపురం రాణి కృష్ణవేణి అరుదైన భగీరథ ప్రయత్నం

తర్వాతి కథనం
Show comments