వడదెబ్బ ఎందుకు తగులుతుంది?

Webdunia
శుక్రవారం, 3 మే 2019 (14:00 IST)
వేసవికాలంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ చాలామంది వడదెబ్బకు గురవుతుంటారు. ఈ పరిస్థితి చాలా మందిలో కనిపిస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుందన్న అంశాన్ని పరిశీలిస్తే, శరీరం శీతలీకరణ వ్యవస్థ కోల్పోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత 102 డిగ్రీల సెల్సియస్‌కిపైగా పెరగడం, చర్మం పొడిబారడం, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా అనిపించడం, గుండె దడ, వాంతులు, వికారం, విరోచనాలు, కండరాల తిమ్మిర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. పరిస్థితి విషమిస్తే కోమాలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంటుంది. ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమైనపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. 
 
ముఖ్యంగా, నీరు, ఇతర శీతలపానీయాలు ఎక్కువగా తీసుకోవాలి. ఎక్కువ ఎండ తగలకుండా చూసుకోవాలి. ఒకవేళ ఎండలో వెళ్లవలసిన పరిస్థితి ఉంటే వదులుగా ఉండే, పల్చని, లేతవర్ణం దుస్తులు వేసుకోవాలి. కాటన్‌ దుస్తులు ధరిస్తే మంచిది. తలపై ఎండపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
 
మద్యపానం, కెఫిన్‌ కలిగిన పానీయాలు తీసుకోరాదు. అవి అధిక మూత్ర విసర్జన కలిగించడం ద్వారా డీహైడ్రేషన్‌కు గురిచేస్తాయి. కాబట్టి తీసుకోకపోవడం మంచిది. గాలి ప్రసరణ బాగా ఉండేలా చూసుకోవాలి. చల్లగాలి తగిలేలా ఉండటం మంచిది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఈవీ ట్రాన్స్ వైస్ ప్రెసిడెంట్‌గా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, రాజకీయాలకు గుడ్ బై?

Rain forecast: అల్పపీడనాలు- ఫిబ్రవరి 19కి తర్వాత తెలుగు రాష్ట్రాలకు అలెర్ట్

రాజస్థాన్‌లో ఘోర అగ్ని ప్రమాదం - కాలి బూడిదైన ఏడుగురు.. క్రాకర్స్ వల్లే?

శీతాకాలానికి బైబై.. తెలంగాణలో పెరిగిన గరిష్ట ఉష్ణోగ్రతలు

అమరావతిలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, బాబుతో భేటీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డానీ ఫస్ట్ లుక్‌ను గమనిస్తే ఎలా ఉండబోతోందో అర్థం అవుతోంది

Shivani Nagaram: కథలో దిబెస్ట్‌ పిక్‌ చేసుకుంటున్నాను : శివానీ నగరం

2 రోజుల్లో వరల్డ్ వైడ్ 3.96 కోట్ల వసూళ్లు దక్కించుకున్న కపుల్ ఫ్రెండ్లీ

Allu Sneha Reddy,: ఆటోపై అల్లు అర్జున్ పేరును చూపించడం గర్వకారణం : అల్లు స్నేహ రెడ్డి

Mani Ratnam: తు యా మైన్ చిత్రంపై మణిరత్నం ప్రశంసల జల్లు

తర్వాతి కథనం
Show comments