Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలింతలు కర్బూజ తింటే మేలెంత..? కాకర రసంతో బహిష్టు నొప్పులకు చెక్

పండ్లు, కూరగాయలు ఎంత ఎక్కువగా తింటే ఆరోగ్యానికి అంత మంచిది. వీటిని రోజూ తీసుకోవడం వల్ల ఎలాంటి జబ్బులూ మన దరికి చేరవని వైద్యులు అంటున్నారు. రోజుకు కనీసం ఐదవ వంతు పండ్లు తినాలని నిపుణులు సూచిస్తున్నారు.

Webdunia
శనివారం, 13 ఆగస్టు 2016 (10:53 IST)
పండ్లు, కూరగాయలు ఎంత ఎక్కువగా తింటే ఆరోగ్యానికి అంత మంచిది. వీటిని రోజూ తీసుకోవడం వల్ల ఎలాంటి జబ్బులూ మన దరికి చేరవని వైద్యులు అంటున్నారు. రోజుకు కనీసం ఐదవ వంతు పండ్లు తినాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఎక్కువ మోతాదులో పండ్లు, కూరగాయలను తీసుకోవడం వల్ల గుండెజబ్బులు రాకుండా కాపాడవచ్చని నిపుణులు అంటున్నారు. వీటిని నిత్యం తినడం వల్ల మనిషి జీవితకాలం పెరుగుతుందని కూడా చెప్తున్నారు. రోజూ డైట్‌లో ఏడవ వంతు పండ్లు, కూరగాయలు తీసుకోవడం వల్ల మనిషి ఆరోగ్యంగా ఉండడంతోపాటు తొందరగా మృత్యువాత పడరని చెప్తున్నారు.
 
స్థూలకాయం, షుగర్ వ్యాధులతో బాధపడే వారికి బత్తాయి మంచి ఔషధంగా పనిచేస్తుంది. రోజూ ఒక గ్లాసు బత్తాయి రసం తాగితే షుగర్ వ్యాధి అదుపులో ఉంటుందని నిపుణులు అంటున్నారు. ద్రాక్షలో ఉండే ఒక రకమైన ఆమ్లాలకు క్యాన్సర్‌ను అడ్డుకునే లక్షణాలు ఉన్నాయి. ప్రతిరోజూ ద్రాక్షను తీసుకుంటే కాన్సర్ వ్యాధి కారకుండా కాపాడుతుంది.
 
కర్బూజ పండు తినడం వల్ల కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయని వైద్యులు చెబుతున్నారు. బాలింతలు కర్బూజ ఎక్కువగా తినడం వల్ల పసి పిల్లలకు పాలు పుష్కలంగా లభిస్తాయి. యాపిల్ పండు రోజూ తినడం వల్ల అల్సర్, విరేచనాలు రాకుండా కాపాడుతుంది. దీనిలో సి-విటమిన్, సెల్యులైజ్, చక్కెర పిండి పదార్థాలు అధికంగా ఉంటాయి. ఈ పండు చర్మానికి తేమను అందించి నిగారింపును కూడా ఇస్తుంది.
 
కాకరకాయ రసంలో చెంచా తేనె కలిపి నాలుగు నెలలు తాగితే బహిష్టు నొప్పులు, కీళ్ల నొప్పులు, ఆయాసం, పొట్టలోని కురుపులు తగ్గుముఖం పడుతుంది. కాకర రసంలో నిమ్మరసం కలిపి పరగడుపున తాగితే రక్తగడ్డలు, తామర, గజ్జి, దురద నయమవుతాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

రూ.50వేల అప్పు తీర్చేందుకు భార్యను అమ్మేశాడు.. స్నేహితుడితో అత్యాచారం చేయించాడు..

వ్యూస్ కోసం చీర చెంగుకి నిప్పంటించుకుని డ్యాన్స్ చేసిన మహిళ (video)

జూలై ఒకటో తేదీ నుంచి పెరగనున్న రైల్వే చార్జీలు?

Ponnam: జూలై 13న బోనాలు.. ప్రజల సహకారం అవసరం.. పొన్నం ప్రభాకర్

ఎయిరిండియా విమానాల్లో అనేక లోపాలను గుర్తించిన డీజీసీఏ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రమ్యశ్రీ భూమి కబ్జా ఆమెపై రియల్టర్ శ్రీదర్ రావు అనుచరులు దాడి

Nitin: నితిన్ తమ్ముడు నుంచి లయ పై జై బగళాముఖీ.. సాంగ్

అహాన్, అనీత్‌ల కెమిస్ట్రీని చాటేలా సాచెట్-పరంపర జంట పాట హైలైట్

సమ్మతమే మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి కొత్త సినిమా

విష్ణు కన్నప్ప కథ చెప్పాక రీసెర్చ్ చేశా; శ్రీకాళహస్తి అర్చకులు మెచ్చుకున్నారు : ముఖేష్ కుమార్ సింగ్

తర్వాతి కథనం
Show comments