అసలే వర్షాకాలం.. ఆహారంలో శుభ్రత అవసరం.. ఈ టిప్స్ పాటించండి

అసలే వర్షాకాలం.. తీసుకునే ఆహారంలో శుభ్రత అవసరం. మనం తీసుకునే ఆహారం కలుషితమైతే.. కడుపునొప్పి, విరేచనాల వంటి సమస్యలెన్నో వేధిస్తాయి. కాబట్టి భోజనం చేయటానికి ముందు మాత్రమే కాదు.. ఆహారం వండటానికి ముందూ చే

Webdunia
మంగళవారం, 31 అక్టోబరు 2017 (12:14 IST)
అసలే వర్షాకాలం.. తీసుకునే ఆహారంలో శుభ్రత అవసరం. మనం తీసుకునే ఆహారం కలుషితమైతే.. కడుపునొప్పి, విరేచనాల వంటి సమస్యలెన్నో వేధిస్తాయి. కాబట్టి భోజనం చేయటానికి ముందు మాత్రమే కాదు.. ఆహారం వండటానికి ముందూ చేతులను బాగా శుభ్రం చేసుకోవాలి. అంతేకాదు.. కూరగాయలను పచ్చి మాంసం వంటి వాటితో కలవకుండా చూసుకోవాలి. 
 
లేనట్లైతే మాంసానికి అంటుకుని ఉండే  బ్యాక్టీరియా వంటివి కూరగాయలకు వ్యాపించే ప్రమాదం వుంది. అలాగే వర్షాకాలంలో ఆహారాన్ని వేడివేడిగా తీసుకోవడం మంచిది. ఫ్రిజ్‌లో నిల్వ వుంచిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోకపోవడం మంచిది. వండిన పదార్థాలను వేడి వాతావరణంలో గంట కన్నా ఎక్కువసేపు బయట ఉంచితే వాటిల్లో బ్యాక్టీరియా వృద్ధి చెందే అవకాశముంది. దీంతో అది కలుషితమై రకరకాల అనర్థాలకు దారితీయొచ్చు. 
 
అందుకే ఓ పూటకు ఆ పూట వండుకుని తినడం మంచిది. వండి నిల్వ వుంచిన మాంసాహారంతోనే కాకుండా.. కూరగాయలతో చేసే ఇతర ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా అనర్ధాలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 
అలాగే వర్షాకాలంలో వేడి వేడి సూప్‌లు, వేడి నీరు తీసుకోవడం మంచిది. వ్యాధినిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని, పండ్లు, కూరగాయలను తీసుకోవాలి. నూనెతో వేయించిన ఆహార పదార్థాలు, గ్రిల్డ్ తండూరీ పదార్థాలను తీసుకోకపోవడం మంచిది. వంటకాల్లో మిరియాలు, అల్లం, పసుపు, కొత్తిమీర, జీలకర్ర చేర్చుకోవాలి. ఓట్స్, శెనగలు, మొక్కజొన్న వంటి ఫైబర్ ఫుడ్స్ తీసుకోవాలి. ఊరగాయలు, పచ్చళ్లు ఎక్కువ తీసుకోకూడదు. 
 
తేనేను వాడటం ద్వారా అనారోగ్య సమస్యలు ఉత్పన్నం కావు. హోటళ్లు, బయటి చిరుతిళ్లను తినడం మానేయాలి. సిట్రస్ ఫ్రూట్స్ అయిన ఆరెంజ్‌ను తీసుకోవచ్చు. మొత్తంగా ఒకేసారి కాకుండా.. నాలుగైదు సార్లు పరిమితంగా ఆహారం తీసుకోవడం ద్వారా వర్షాకాలం అజీర్తిని దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

స్వచ్ఛ గోదావరి - పవిత్ర పుష్కరాలు : కాలుష్య రహిత గోదావరి కోసం నిరంతర తనిఖీలు : పవన్ ఆదేశం

టెక్కీలుగా తక్కువ జీతానికే పనిచేసే బదులు బొగ్గుల పొయ్యిపై చికెన్ స్నాక్స్ అమ్మడం బెటర్, వీడియో

హైదరాబాద్ నగరంలో ఎకరం భూమి ధర రూ.237 కోట్లు

డీకే మంత్రివర్గంలో నా కొడుక్కీ కీలక పదవి ఇవ్వాల్సిందే : రాహుల్ వద్ద సిద్ధు డిమాండ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి విరాళిస్తున్న త్యాగధనులు, ఎవరెవరు ఎంతెంత ఇచ్చారు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

KajaL Agarwal: ఎప్పటికీ అంతం కాని బంధంగా కాజల్ అగర్వాల్, సమంత రూత్ ప్రభు

Samantha: రాజ్ నిడిమోరు విజయవంతమైన దర్శకుడే కాదు, భర్త కూడా!

Mahesh Babu :మహేష్ బాబు 1: నేనొక్కడినే 4K ఫార్మెట్ లో వారణాసిలో ముందస్తు షోలు

కలెక్షన్ నంబర్లలో ఒక చిత్ర విజయాన్ని నిర్ణయించలేం : రామ్ చరణ్

ప్రతి ఒక్కరికి కష్టాలు కామన్‌గా ఉంటాయి... కానీ : జగపతి బాబు

తర్వాతి కథనం
Show comments