Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసలే వర్షాకాలం.. ఆహారంలో శుభ్రత అవసరం.. ఈ టిప్స్ పాటించండి

అసలే వర్షాకాలం.. తీసుకునే ఆహారంలో శుభ్రత అవసరం. మనం తీసుకునే ఆహారం కలుషితమైతే.. కడుపునొప్పి, విరేచనాల వంటి సమస్యలెన్నో వేధిస్తాయి. కాబట్టి భోజనం చేయటానికి ముందు మాత్రమే కాదు.. ఆహారం వండటానికి ముందూ చే

Webdunia
మంగళవారం, 31 అక్టోబరు 2017 (12:14 IST)
అసలే వర్షాకాలం.. తీసుకునే ఆహారంలో శుభ్రత అవసరం. మనం తీసుకునే ఆహారం కలుషితమైతే.. కడుపునొప్పి, విరేచనాల వంటి సమస్యలెన్నో వేధిస్తాయి. కాబట్టి భోజనం చేయటానికి ముందు మాత్రమే కాదు.. ఆహారం వండటానికి ముందూ చేతులను బాగా శుభ్రం చేసుకోవాలి. అంతేకాదు.. కూరగాయలను పచ్చి మాంసం వంటి వాటితో కలవకుండా చూసుకోవాలి. 
 
లేనట్లైతే మాంసానికి అంటుకుని ఉండే  బ్యాక్టీరియా వంటివి కూరగాయలకు వ్యాపించే ప్రమాదం వుంది. అలాగే వర్షాకాలంలో ఆహారాన్ని వేడివేడిగా తీసుకోవడం మంచిది. ఫ్రిజ్‌లో నిల్వ వుంచిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోకపోవడం మంచిది. వండిన పదార్థాలను వేడి వాతావరణంలో గంట కన్నా ఎక్కువసేపు బయట ఉంచితే వాటిల్లో బ్యాక్టీరియా వృద్ధి చెందే అవకాశముంది. దీంతో అది కలుషితమై రకరకాల అనర్థాలకు దారితీయొచ్చు. 
 
అందుకే ఓ పూటకు ఆ పూట వండుకుని తినడం మంచిది. వండి నిల్వ వుంచిన మాంసాహారంతోనే కాకుండా.. కూరగాయలతో చేసే ఇతర ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా అనర్ధాలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 
అలాగే వర్షాకాలంలో వేడి వేడి సూప్‌లు, వేడి నీరు తీసుకోవడం మంచిది. వ్యాధినిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని, పండ్లు, కూరగాయలను తీసుకోవాలి. నూనెతో వేయించిన ఆహార పదార్థాలు, గ్రిల్డ్ తండూరీ పదార్థాలను తీసుకోకపోవడం మంచిది. వంటకాల్లో మిరియాలు, అల్లం, పసుపు, కొత్తిమీర, జీలకర్ర చేర్చుకోవాలి. ఓట్స్, శెనగలు, మొక్కజొన్న వంటి ఫైబర్ ఫుడ్స్ తీసుకోవాలి. ఊరగాయలు, పచ్చళ్లు ఎక్కువ తీసుకోకూడదు. 
 
తేనేను వాడటం ద్వారా అనారోగ్య సమస్యలు ఉత్పన్నం కావు. హోటళ్లు, బయటి చిరుతిళ్లను తినడం మానేయాలి. సిట్రస్ ఫ్రూట్స్ అయిన ఆరెంజ్‌ను తీసుకోవచ్చు. మొత్తంగా ఒకేసారి కాకుండా.. నాలుగైదు సార్లు పరిమితంగా ఆహారం తీసుకోవడం ద్వారా వర్షాకాలం అజీర్తిని దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments