Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధుమేహం వున్నా విందుకు వెళ్లాలనుకుంటున్నారా?

మధుమేహులు విందుకు వెళ్లాలనుకుంటే.. ముందు సలాడ్స్‌ తినేయడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. విందుకు వెళ్లే ముందు.. ఇంట్లోనే సలాడ్లను, వేయించిన శెనగలు కానీ, సోయా గింజలను కానీ గుప్పెడు తినడం మంచిద

Webdunia
సోమవారం, 10 సెప్టెంబరు 2018 (16:01 IST)
మధుమేహులు విందుకు వెళ్లాలనుకుంటే.. ముందు సలాడ్స్‌ తినేయడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. విందుకు వెళ్లే ముందు.. ఇంట్లోనే సలాడ్లను, వేయించిన శెనగలు కానీ, సోయా గింజలను కానీ గుప్పెడు తినడం మంచిది. ఇలా చేస్తే విందులో తినుబండారాల్ని ఆబగా తినేసే మానసిక స్థితి ఉండదు. ఇది గ్లూకోజ్‌ నియంత్రణకు తోడ్పడుతుంది.
 
ఇక పార్టీలో పీచుపదార్థం వుండే ఆహారాన్ని అధికంగా తీసుకోవాలి. మష్రూమ్‌, పన్నీర్‌ టిక్కా, సాదా దోసె లాంటివి తీసుకోవాలి. అయితే ఏ పదార్థాలైనా నిర్ణీత పరిమాణాన్ని మించి తీసుకోకూడదు. పైగా ఎంత నోరూరించినా ఒకేసారి అన్నీ కాకుండా ఓ అరగంట వ్యవధి ఇచ్చి తీసుకుంటే మేలు. 
 
సలాడ్‌తో మొదలెట్టి ఆ తర్వాత తందూరీ రోటీ తీసుకోవాలి. సలాడ్‌ను పెరుగుతో కలిపి కూడా తీసుకోవచ్చు. ఇక ఎక్కువ కేలరీలు వుండే పప్పులు, నూనె, మసాలా కూరలు మాత్రం తీసుకోకూడదు. అలాగే మీగడ లేదా నెయ్యితో చేసిన పదార్థాలు అసలే తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
ఇన్సులిన్ తీసుకునే వారైతే కార్బోహైడ్రేట్లు అంటే పిండి పదార్థాల జోలికి వెళ్లకూడదు. పార్టీ నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత ఓ సగం చెంచా మెంతి పొడి వేసుకుని గ్లాసు నీళ్లు తాగేస్తే గ్లూకోజ్‌ నియంత్రణలో ఉండడానికి ఎంతో తోడ్పడుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

పాకిస్తాన్ 2 ముక్కలు, స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ప్రకటన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'శుభం' మూవీ చూస్తున్నంత సేవు కడుపుబ్బా నవ్వుకున్నా... సమంత తల్లి ట్వీట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

తర్వాతి కథనం
Show comments