Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలేయం పువ్వు లాంటిది.. రాత్రి 8 గంటలకు తర్వాత భోజనం చేశారో?

ఉదయం, మధ్యాహ్నం కడుపు నిండా తినండి. కానీ రాత్రి పూట 8 గంటలకు తర్వాత ఆహారాన్ని అస్సలు ముట్టుకోవద్దని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. రాత్రి ఎనిమిది గంటలకు తర్వాత తీసుకునే ఆహారం కాలేయానికి ఇబ్బందిని తెచ్చ

Webdunia
శనివారం, 10 ఫిబ్రవరి 2018 (15:29 IST)
ఉదయం, మధ్యాహ్నం కడుపు నిండా తినండి. కానీ రాత్రి పూట 8 గంటలకు తర్వాత ఆహారాన్ని అస్సలు ముట్టుకోవద్దని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. రాత్రి ఎనిమిది గంటలకు తర్వాత తీసుకునే ఆహారం కాలేయానికి ఇబ్బందిని తెచ్చిపెడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాలేయం ఓ పువ్వులాంటిదని... లేటుగా ఆహారం తీసుకుంటే పువ్వులాంటి కాలేయం దెబ్బతింటుందని.. తద్వారా అనారోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 
ఒక వేళ ఎనిమిది గంటలకు తర్వాత ఆకలేస్తే ఓ రెండు అరటి పండ్లు పాలు తీసుకుని నిద్రించాలే తప్ప.. 8 గంటలకు తర్వాత ఫుల్ మీల్స్ లాగిస్తే మాత్రం కాలేయానికి ముప్పు తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదయం పూట అల్పాహారాన్ని 8.30 గంటల్లోపు, మధ్యాహ్నం పూట భోజనాన్ని ఒంటి గంటలోపు పూర్తి చేయడం ద్వారా బరువు పెరగరు.
 
ఇంకా గంటల పాటు కంప్యూటర్ల ముందు కూర్చునే ఉద్యోగమైతే తప్పకుండా గంటపాటు వ్యాయామం చేయాల్సిందేనని.. అలాకాకుంటే ఒబిసిటీ, మధుమేహం వంటి వ్యాధులు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 
 
అలాగే రాత్రి పూట లేకుంటే తరచు వేపుడు పదార్థాలు, మైదా వంటలు, ఊరగాయలు తినడం మానేయాలని, రాత్రి ఆహారంలో యాభై శాతం పచ్చి కూరగాయలు, పళ్లు తీసుకోవాలి. ఇంకా అధిక బరువు, మధుమేహం, అధిక రక్తపోటు ఉన్నవారు రాత్రి ఆహారంలో అన్నం కాకుండా గోధుమ పుల్కాలు, జొన్న రొట్టెలు తీసుకోవడం ఉత్తమమని, ఉప్పు, పంచదార మితంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

విశాఖలో జూన్ 9న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స జోస్యం

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

హైదరాబాదులో అక్రమ డ్రగ్స్... గంజాయి స్వాధీనం, నలుగురు అరెస్ట్

వైకాపాకు మహా అయితే 25 సీట్లు వస్తే ఎక్కువ : ఆర్ఆర్ఆర్ జోస్యం

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

తర్వాతి కథనం
Show comments