ఎండు ద్రాక్షలు ఆరోగ్య ప్రయోజనాలు.. బరువు తగ్గాలంటే?

Webdunia
శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (20:33 IST)
ఎండు ద్రాక్షలు, కిస్మిస్‌లలో పాలిఫినాలిక్ ఫైటో పోషకాలుంటాయి. ఇవి వాపులను తగ్గిస్తాయి. బాక్టీరియా వల్ల వచ్చే ఇన్‌ఫెక్షన్లను అడ్డుకుంటాయి. ఈ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు క్యాన్సర్ రాకుండా చూస్తాయి. కంటి రోగాల నుంచి రక్షణనిస్తాయి. కిస్మిస్‌లను తినడం వల్ల రక్త సరఫరా మెరుగు పడుతుంది. గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. కిస్మిస్‌లలో రాగి, ఇనుము, విటమిన్ బి 12 కూడా ఉంటాయి. 
 
కాబట్టి అనీమియా ఉన్నవారు వీటిని తింటే రక్తహీనత తగ్గుతుంది. త్వరగా గాయాలు నయం అవుతాయి. కిస్మిస్‌లలో పొటాషియం, మెగ్నిషియం ఉంటాయి. వీటిని తినడం వల్ల అసిడిటీ రాదు. కిస్మిస్‌లలో కాల్షియం ఉండడం వల్ల దంతాలకు, ఎముకలకు మంచిది. వాటిలో ఉండే బోరాన్ అనే ఖనిజం మూలంగా ఎముకలకు సంబంధించిన ఆస్టియో పోరోసిస్‌ను రాకుండా చూసుకోవచ్చు. 
 
అధిక శరీర బరువు సమస్యతో బాధపడేవారు తరచూ వారి ఆహార పదార్థాలలో ఎండు ద్రాక్షను తీసుకోవడం వల్ల శరీర బరువును తగ్గించుకోవచ్చు. ఎండుద్రాక్షలు తక్కువ పరిమాణంలో కేలరీలు ఉండడమే కాకుండా, సహజంగా తియ్యగా ఉంటాయి. ఈ ఎండుద్రాక్షలను తరచూ తీసుకోవడం వల్ల అదనపు కేలరీలను తీసుకోవాలనే కోరికలను అణిచి వేస్తుంది. తద్వారా అధిక ఆహారం తీసుకోకుండా శరీర బరువును నియంత్రించడానికి ఎండు ద్రాక్షలు కీలకపాత్ర పోషిస్తాయి. 
 
అదేవిధంగా మన శరీరంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. ప్రతిరోజు రాత్రి నానబెట్టిన ఎండుద్రాక్షలను మరుసటి రోజు ఉదయం పరగడుపున తిని ఆ నీటిని తాగడం వల్ల ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే ఎండు ద్రాక్షలను కేవలం తక్కువ పరిమాణంలో తీసుకున్నప్పుడు మాత్రమే శరీర బరువును తగ్గించుకోవచ్చు. 
 
ఎండుద్రాక్షలలో అధిక మొత్తంలో క్యాల్షియం, ఐరన్, విటమిన్ సి అధికంగా లభిస్తాయి. ఈ పోషకాలు అధిక మొత్తంలో మన శరీరానికి అందడం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో దోహదపడతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఉచితంగా నిత్యావసర సరుకులు

Pothuluri: మొంథా తుఫాను- కూలిపోయిన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నివాస గృహం.. అరిష్టమా? (video)

స్నేహితులకు అప్పులు తీసిచ్చి.. వారు తిరిగి చెల్లించకపోవడంతో డాక్టర్ ఆత్మహత్య.. ఎక్కడ?

Cyclone montha: తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు.. మంచిరేవుల గ్రామ రోడ్డు మూసివేత

వచ్చే విద్యా సంవత్సరం నుంచి పారశాఠల్లో అల్పాహార పథకం: భట్టి విక్రమార్క

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janviswaroop: మహేష్ బాబు మేనకోడలు జాన్విస్వరూప్ నటిగా ఎంట్రీ సిద్ధం

Naveen Chandra: అప్పుడు అరవింద సమేత - ఇప్పుడు మాస్ జాతర : నవీన్ చంద్ర

Suriya: రజినీకాంత్, అమితాబ్ బచ్చన్ లా వినోదాన్ని పంచగల హీరో రవితేజ: సూర్య

Down down CM: డౌన్ డౌన్ సి.ఎం. అంటూ రేవంత్ రెడ్డి సమావేశం వద్ద నిరసన సెగ

Revanth Reddy: కర్ణుడులా మిత్ర ధర్మాన్ని పాటిస్తా, సినీ కార్మికుల వెల్ఫేర్ కోసం పది కోట్లు ఇస్తా : రేవంత్ రెడ్డి

తర్వాతి కథనం
Show comments