Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిలబడి నీళ్లు తాగుతున్నారా? ఐతే అనారోగ్యం తెచ్చుకున్నట్లే.. ఏం చేయాలి?

Webdunia
గురువారం, 4 ఏప్రియల్ 2019 (16:25 IST)
సాధారణంగా పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం మంచిది అనే సామెతను వింటూనే ఉంటాం. ఇది సామెత వరకు అయితే సరి, కానీ నీళ్లు నిలబడి తాగితే మాత్రం చాలా డేంజర్ అంటూ నిపుణులు అంటున్నారు. రోజుకి కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగితే మంచిదని తెలుసుగానీ, నీళ్లను నిలబడి తాగకూడదని చాలా మందికి తెలియదు. ఇలా నిలబడి నీళ్లు తాగితే ఆరోగ్యపరంగా చాలా దుష్ప్రభావాలు ఉంటాయని అంటున్నారు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 
నీళ్లు నిలబడి తాగడం వల్ల కిడ్నీలకు నీరు అందదని, దాంతో కిడ్నీ, మూత్రాశయ సంబంధ వ్యాధుల బారినపడే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆహార నాళం గుండా జీర్ణాశయంలోకి ఒక్కసారిగా వచ్చి చేరతాయి. తద్వారా జీర్ణాశయం గోడలపై నీరు ఒకేసారి చిమ్మినట్లవుతుంది. దీని వలన అత్యంత సున్నితంగా ఉండే జీర్ణాశయం గోడలు దెబ్బ తింటాయి. జీర్ణాశయం గోడలు దెబ్బతింటే..ఎసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి నిలబడి నీళ్లు తాగకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అంతేకాదు... చాలామంది బఫే సిస్టమ్ అంటూ నిలబడి భోజనం చేయడం కూడా జరుగుతూ వుంది. ఇది కూడా ఆరోగ్యానికి హాని కలిగించే అలవాటు అంటున్నారు. ఈ రెండింటినీ కూర్చుని మాత్రమే చేయాలని ఆయుర్వేదం సూచిస్తోంది. ఐతే ఈ రోజుల్లో చాలామంది నిలబడే నీళ్లు, భోజనం లాగించేస్తున్నారు. ఈ అలవాటుని మార్చుకుని ఈ రెండింటినీ కూర్చుని చేస్తే ఆరోగ్యకరం.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments