Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కొబ్బరి పాలలో తేనె కలిపి.. ఇలా చేస్తే..?

కొబ్బరి పాలలో తేనె కలిపి.. ఇలా చేస్తే..?
, గురువారం, 4 ఏప్రియల్ 2019 (15:01 IST)
ఎండ వలన నల్లగా మారి కమిలిన చర్మానికి కొబ్బరి, కొబ్బరి నీళ్లు ఎంతో మేలు చేస్తాయి. కుదుళ్లను బలంగా మార్చడంలో కొబ్బరి పాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. జుట్టు పొడిబారి ఎండు గడ్డిలా కనిపిస్తున్నప్పుడు.. కప్పు కొబ్బరి పాలలో నాలుగు చెంచాల తేనె, ఒకటి లేదా రెండు కోడిగుడ్ల తెల్ల సొన చేర్చి బాగా కలిపి తలంతా పట్టించాలి. అరగంటయ్యాక తలస్నానం చేస్తే జుట్టు పట్టుకుచ్చులా తయారవుతుంది.
 
అప్పటికప్పుడు చర్మానికి మెరుపు రావాలంటే.. కొబ్బరి పాలల్లో దూదిని ముంచి ముఖమంతా మృదువుగా మర్దన చేసి కాసేపయ్యాక కడిగేసుకోవాలి. ఇలా వారంలో రెండుసార్లు క్రమంగా చేస్తే ఫలితం ఉంటుంది. శరీరం కోమలంగా తయారై.. ప్రకాశవంతంగా కనిపించాలంటే.. స్నానానికి అరగంట ముందు.. కొబ్బరిపాలతో బాగా మర్దన చేసుకుని సోయాపిండిలో కొద్దిగా బత్తాయిరసం కలిపి నలుగులా పెట్టుకోవాలి. 
 
బయటినుంచి వచ్చాక 5 నిమిషాలు విశ్రాంతి తీసుకుని కొబ్బరి నీటితో ముఖం కడుక్కుంటే.. ఎండ వలన నల్లగా మారిన చర్మం తాజాదనాన్ని పొందుతుంది. కొబ్బరినీటిలో దూదిని ముంచి రాసుకున్నా తేడా కనిపిస్తుంది. కొబ్బరి నీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. గంటపాటు అలానే ఉంచి ఆ తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా తరచు చేస్తుంటే.. ముఖంపై గల నల్లటి మచ్చలు, మొటిమలు పోతాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వేసవికాలంలో కూల్‌డ్రింక్స్ తాగుతున్నారా?.. జాగ్రత్త.. లేకుంటే..?