Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎముకలకు బలాన్నిచ్చే మునగాకు, రాగులు.. (వీడియో)

ఎముకల బలం కోసం క్యాల్షియం తగిన మోతాదులో తీసుకోవాల్సిందేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎముకలు శరీరానికి ఆధారం. అలాంటి ఎముకలు అనారోగ్యం బారిన పడకుండా కాపాడుకోవాలంటే.. పాలను ఎక్కువగా తీసుకోవాలి. శరీరాని

Webdunia
శుక్రవారం, 3 నవంబరు 2017 (18:38 IST)
ఎముకల బలం కోసం క్యాల్షియం తగిన మోతాదులో తీసుకోవాల్సిందేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎముకలు శరీరానికి ఆధారం. అలాంటి ఎముకలు అనారోగ్యం బారిన పడకుండా కాపాడుకోవాలంటే.. పాలను ఎక్కువగా తీసుకోవాలి. శరీరానికి విటమిన్-డి లభించే ఆహారం కూడా తీసుకోవాలి. ఎముకలు బలంగా ఉండాలంటే.. రోజూ ఉదయం, రాత్రి పావు టీ స్పూన్‌ దాల్చిన చెక్కను మెత్తని చూర్ణంగా చేసి పాలల్లో కలిపి తాగడం మంచిది. అలాగే కప్పు వేడిపాలలో టీ స్పూన్‌ నువ్వుల పొడిని కలిపి రోజుకు మూడుసార్లు తాగుతుంటే ఎముకలు బలపడతాయి. 
 
అంతేగాకుండా మునగ ఎముకలకు బలాన్నిస్తాయి. మునగ కాయలతో పులుసు చేసుకుని తింటే ఎముకలకు బలం చేకూరుతుంది. కాల్షియం ఎక్కువగా ఉండే మునగ ఆకులతో కూరను, పువ్వులతో చట్నీ చేసుకుని తింటే ఎముకలు బలపడతాయి. ఎనిమిది బాదం గింజలు నీటిలో నానబెట్టి ఉదయాన్నే వాటిపై పొరలు తీసి ఆవుపాలలో కలిపి నూరి గ్లాసు పాలతో తాగాలి. 
 
ఇంకా గ్లాసు పాలల్లో అల్లం రసం, తేనెలను ఒక టీ స్పూన్‌ చొప్పున కలిపి తాగడం ద్వారా ఎముకలను బలంగా వుంచుకోవచ్చు. కాల్షియం అధికశాతంలో ఉండే రాగుల వాడకం ద్వారా ఎముకలను బలంగా వుంచుకోవచ్చు. దీనిలో పీచుపదార్థాం కూడా ఉండటం ద్వారా క్యాన్సర్ దరిచేరదు. పాలకంటే రాగుల్లోనే కాల్షియం ఎక్కువ. రాగులతో పిండివంటలు, జావ, అంబలి లేదా రాగిమాల్ట్‌ తయారు చేసుకుని వారానికి రెండుసార్లైనా తీసుకుంటే ఎముకలు బలపడతాయి.
 
ఎముకల దృఢత్వానికి తగినంత శారీరక శ్రమ, వ్యాయామం కూడా అవసరమే. దీంతో ఎముకలపై ఒత్తిడి పడి వాటి లోపలి భాగానికి క్యాల్షియం చేరుకుంటుంది. అందువల్ల క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం మంచిది. వేగంగా నడవటం, పరుగు, మెట్లు ఎక్కటం వంటివన్నీ ఎంతో మేలు చేస్తాయి. ఒంటికి ఎండ తగిలినపుడు చర్మం తనకు తానుగానే విటమిన్‌ డి స్వీకరిస్తుంది. అందుచేత గంటల పాటు కూర్చోకుండా.. ఎండపడేలా పది నిమిషాలు బయట తిరగాలి.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments