Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవికాలంలో దాహార్తి.. నేరేడు పండ్లను తీసుకుంటే?

Webdunia
సోమవారం, 29 ఏప్రియల్ 2019 (14:43 IST)
వేసవి కాలంలో ఎక్కువగా నీరు తాగాలనిపిస్తుంది. కొంత మందికి దాహం చాలా ఎక్కువగా ఉంటుంది. అతి దాహాన్ని నివారించే గుణాలు నేరేడు పండ్లలో ఉన్నాయి. ఎండా కాలంలో వేడి చేయకుండా ఉండాలంటే నేరేడు పండ్లను తింటే మంచిది. ఇవి శరీరానికి చలువచేస్తాయి. మూత్రాశయ రోగాలను నయం చేయడంలో ఇవి తోడ్పడతాయి. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా చూస్తాయి. 
 
కడుపులోని నులి పురుగులను నేరేడు పండ్లు నివారిస్తాయి. నోటి, మూత్రాశయ క్యాన్సర్‌లకు ఔషధంగా పనిచేస్తుంది. ప్రమాదవశాత్తూ కడుపులో చేరుకున్న వెంట్రుకలను సైతం నేరేడు కరిగిస్తుంది. 
 
నేరేడు పండ్ల రసంలో కొంచెం చెక్కర కలిపి తాగితే ఉదర సంబంధిత వ్యాధులు తొలగిపోతాయి. నేరేడు విత్తనాలను ఎండబెట్టి చూర్ణం చేసి తరచుగా తీసుకుంటుంటే అతిమూత్ర వ్యాధి అదుపులో ఉంటుంది. నేరేడు పుల్లతో పళ్లు తోముకుంటే చిగుళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. చిగుళ్ళు నుంచి రక్తస్రావం తగ్గుతుంది. 
 
నోటి దుర్వాసన దూరమవుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. నేరేడుపండ్లలో కాల్షియం, మెగ్నీషియం, పాస్ఫరస్‌, సోడియం, విటమిన్‌ సి, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. 
 
నేరేడు పండ్లను తింటే మధుమేహ వ్యాధి నియంత్రణలో ఉంటుంది, రక్తహీనత తగ్గుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణక్రియ మెరుగవ్వాలంటే కప్పు పెరుగులో నాలుగు చెంచాల నేరేడు పండ్ల రసం కలిపి తీసుకుంటే మంచి ఫలితం కనబడుతుంది.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments