Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధుమేహానికి దివ్యౌషధం మునగాకు.. పాలకంటే 16 రెట్లు..?

మునగాకులో పాలకంటే 16 రెట్లు అధికంగా క్యాల్షియం వుంటుంది. అందుకే వారానికి రెండుసార్లు మునగాకును తీసుకునే వారిలో ఎముకలు దృఢంగా మారుతాయి. మునగాకు ఎదిగే పిల్లలకు ఎంతో మేలుచేస్తుంది. దంత, ఎముకల సమస్యలను ని

Webdunia
సోమవారం, 9 జులై 2018 (10:11 IST)
మునగాకులో పాలకంటే 16 రెట్లు అధికంగా క్యాల్షియం వుంటుంది. అందుకే వారానికి రెండుసార్లు మునగాకును తీసుకునే వారిలో ఎముకలు దృఢంగా మారుతాయి. మునగాకు ఎదిగే పిల్లలకు ఎంతో మేలుచేస్తుంది. దంత, ఎముకల సమస్యలను నివారిస్తుంది. అలాగే అరటి పండ్ల కంటే 15 రెట్లు పొటాషియం మునగాకు ద్వారా అందుతుంది. దీంతో హృద్రోగాలను దూరం చేసుకోవచ్చు. 
 
శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరుచుకోవచ్చు. మున‌గాకును రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున తింటున్నా లేదంటే మున‌గ ఆకుల‌ను ఎండ‌బెట్టి పొడి చేసి ఆ పొడిని రోజూ తీసుకుంటున్నా మధుమేహం దరిచేరదు. రోజుకు ఏడు గ్రాముల మునగాకు పొడిని మూడు నెలల పాటు తీసుకుంటే రక్తంలో చక్కెర లెవల్స్ తగ్గాయని ఇప్పటికే పలు పరిశోధనలు తేల్చాయి. వీటిలో ఉండే క్లోరోజెనిక్‌ యాసిడ్‌ ద్వారా బ్లడ్‌లో షుగర్‌ లెవల్స్‌ని అదుపులో ఉంచవచ్చు. మునగాకు ఐదు రకాల క్యాన్లర్లకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. 
 
అలాగే లంగ్‌, లివర్‌, ఒవేరియన్‌, మెలానోమా వంటి క్యాన్సర్లను నిరోధించడంలో మునగాకు ఎంతో మెరుగ్గా పనిచేస్తుంది. థైరాయిడ్‌ను క్రమబద్ధీకరించే సహజమైన మందుగానూ మునగాకు పనిచేస్తుంది. అలాగే మునగాకు రసాన్ని రోజూ తాగితే దృష్టి మాంద్యం, రేచీకటి తగ్గుతాయి. గర్భిణీ మహిళలకు, బాలింతలకు మునగాకు రసం ద్వారా ఎంతో మేలు చేకూరుతుంది. మునగాకు రసాన్ని పాలల్లో క‌లిపి పిల్లలకు అందిస్తే ఎముకలు బలంగా తయారవుతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Covid Panic: బెంగళూరులో పెరుగుతున్న కోవిడ్-19 కేసులు- మార్గదర్శకాలను పాటించాల్సిందే

COVID: హైదరాబాద్‌లో కోవిడ్-19 కేసు- డాక్టర్‌కు కరోనా.. ఇప్పుడెలా వున్నారంటే?

కేసీఆర్ చుట్టూత కొన్ని దెయ్యాలు ఉన్నాయ్ : ఎమ్మెల్సీ కవిత

Kavitha: తెలంగాణలో మరో షర్మిలగా మారనున్న కల్వకుంట్ల కవిత? (video)

43 సంవత్సరాల జైలు శిక్ష-104 ఏళ్ల వృద్ధుడు- చివరికి నిర్దోషిగా విడుదల.. ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ చిత్రం డకాయిట్ - ఏక్ ప్రేమ్ కథ

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

తర్వాతి కథనం
Show comments