Webdunia - Bharat's app for daily news and videos

Install App

షాపుల్లో పండ్ల రసాలను ఎంచక్కా లాగిస్తున్నారా? జ్యూసుల్లో వాడే ఐస్ ఎలా చేస్తారో తెలుసా?

తాజా పండ్ల రసాలు తాగితే ఆరోగ్యానికి మేలు చేకూరుతుందని ఆరోగ్య నిపుణులు. ఇక ఇంట్లో తాజా పండ్ల రసాలను సిద్ధం చేసుకోవడం కుదరక షాపుల్లో పండ్ల రసాలను ఎంచక్కా తాగేస్తుంటాం. అయితే పండ్ల రసాలను ఇంట్లోనే సిద్ధం

Webdunia
ఆదివారం, 12 ఫిబ్రవరి 2017 (14:10 IST)
తాజా పండ్ల రసాలు తాగితే ఆరోగ్యానికి మేలు చేకూరుతుందని ఆరోగ్య నిపుణులు. ఇక ఇంట్లో తాజా పండ్ల రసాలను సిద్ధం చేసుకోవడం కుదరక షాపుల్లో పండ్ల రసాలను ఎంచక్కా తాగేస్తుంటాం. అయితే పండ్ల రసాలను ఇంట్లోనే సిద్ధం చేసుకోవడం మంచిదని.. ఫ్రూట్ జ్యూస్‌లకంటే పండ్లను అలాగే తీసుకోవడం ఉత్తమం అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫ్రూట్ షాపుల్లో ఉపయోగించే పండ్లు తాజాగా ఉన్నాయా? కుళ్లిపోయినవా? అనే విషయం మనకు తెలియదు. 
 
అంతకంటే జ్యూస్‌ల కోసం షాపుల్లో ఉపయోగించే నీరు శుభ్రంగా ఉందా? లేదా? వారు వాడే ఐస్ ఎలాంటిది అనే దానిపై దృష్టి పెట్టలేం కాబట్టి.. ఇంట్లోనే పండ్ల రసాలను సిద్ధం చేసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఐస్ కోసం వాడే నీటితో చాలా డేంజరని.. వాటి ద్వారా అనారోగ్య సమస్యలు తప్పవంటున్నారు. అందుకే బయట షాపుల్లో ఫ్రూట్ జ్యూస్ తాగాలనిపించినా విత్ అవుట్ ఐస్ తీసుకోవడం మంచిది.
 
అందుకే ఇలాంటి జ్యూస్‌లు తాగేవారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయని, కుళ్లిన పండ్లపై అత్యంత ప్రమాదకరమైన బ్యాక్టీరియాలు ఉంటున్నాయని, కుళ్లిన పండ్లతో తయారు చేసిన జ్యూస్ క్యాన్సర్, జాండిస్, అతిసార లాంటి అత్యంత ప్రమాదకరమైన వ్యాధులకు గురిచేస్తున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
 
పండ్లను ఎక్కువ కాలం నిల్వ ఉంచడం ద్వారా కొలై, షెగెల్లా, సైఫర్‌కోకస్ లాంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియాలు వృద్ధి చెందుతాయి. అంతేకాదు కాదు పండ్లను తాజాగా ఉంచడం కోసం ఇంజక్షన్లను ఉపయోగించడం, సువాసనలకోసం రకరకాల రసాయనాలను వాడడటం, బోరునీళ్లతో ఐస్ తయారు చేయడం, కుళ్లినపండ్లపై దుమ్మూ, ధూళి చేరడం, అపరిశుభ్రమైన చేతులను జ్యూస్‌తయారీకి వాడడం మొదలైనవన్నీ కలిసి రసాయన చర్య జరిగి జ్యూస్ తాగేవారిపై ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అందుకే పండ్లను తాజాగా కొనుగోలు చేసి వాటిని ఇంట్లోనే పండ్ల రసంగానూ లేక అలాగే తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేకూర్చిన వారవుతారని వైద్యులు సలహా ఇస్తున్నారు. 

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments