Webdunia - Bharat's app for daily news and videos

Install App

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఇవి తీసుకోకూడదు...

Webdunia
శనివారం, 19 ఫిబ్రవరి 2022 (20:37 IST)
అధిక రక్తపోటు అనేది ఇదివరకు వయసు పైబడినవారిలో కనబడేది. కానీ ఇప్పుడు అది యువతలోనూ కనబడుతోంది. అధిక బిపి సమస్యకు కారణం క్రమబద్ధమైన ఆహారం తీసుకోకపోవడంతో పాటు జీవనశైలిలో తేడాలు. అయితే, చాలా మంది ఈ సమస్యను తీవ్రంగా పరిగణించరు. అయితే అధిక రక్తపోటును అశ్రద్ధ చేస్తే ప్రాణాలకే ముప్పు తెస్తుంది. అధిక బీపీ ఉన్నవారు క్రింద తెలియజేయబోయే పదార్థాలను దూరంగా పెట్టేయాలి.


ఉప్పులో సోడియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉప్పును హైబీపీ రోగులకు శత్రువు అంటారు. హైబీపీ ఉన్న రోగులైతే ఉప్పు తీసుకోవడం తగ్గించేయాలి. ఆహార పదార్థాల పైన కొందరికి ఉప్పు చల్లుకుని తినే అలవాటు వుంటుంది. అలాంటి పదార్థాన్ని ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. ఆహారంలో సముద్రపు ఉప్పుకు బదులుగా రాతి ఉప్పును ఉపయోగించడం మంచిది.
 
 
ప్రాసెస్ చేసిన మాంసం జోలికి వెళ్లకూడదు. ఎందుకంటే అందులో సోడియం పరిమాణం కూడా చాలా ఎక్కువ. దానిని కాపాడేందుకు ఉప్పు కలుపుతారు. కాబట్టి, ప్రాసెస్ చేసిన మాంసాన్ని తినకూడదు. ఇది కాకుండా, సాస్, ఊరగాయ, చీజ్ లేదా బ్రెడ్‌తో మాంసం తినడం వల్ల సమస్య వేగంగా పెరుగుతుంది. కాబట్టి, హై బీపీ ఉన్నవారు ప్రాసెస్ చేసిన మాంసానికి దూరంగా ఉండాలి.

 
కాఫీలో వుండే కెఫీన్ రక్తపోటును పెంచడానికి పని చేస్తుంది. కాబట్టి అధిక రక్తపోటు వున్న రోగులకు కాఫీ తీసుకోమని నిపుణులు ఎప్పుడూ సలహా ఇవ్వరు. హైబీపీతో ఇబ్బంది పడుతుంటే కాఫీని మానేయడం మంచిది. అలాగే ప్యాక్ చేసిన ఆహారాలలో సాధారణంగా అధిక మొత్తంలో సోడియం ఉంటుంది. సోడియం ఉన్న ఏదైనా బిపిని పెంచడానికి పని చేస్తుంది. అందుకే మార్కెట్‌లో ఉండే ప్యాక్‌డ్ ఫుడ్స్‌కు బదులుగా ఇంట్లోనే ఆరోగ్యకరమైన ఆహారాన్ని చేసుకుని తినడం మంచిది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వృద్ధుడుని కొమ్ములతో పైకెత్తి.. నేలకేసి కొట్టి.. కాళ్లతో తొక్కేసిన ఎద్దు (Video)

పొట్టి దస్తులు ధరించే మహిళలు రాక్షసి శూర్పణఖలు : బీజేపీ మంత్రి కైలాస్ విజయ్

Elon Musk: నేను లేకుంటే, ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయేవాడు: ట్రంప్‌పై ఫైర్ అయిన ఎలోన్ మస్క్

Sharmishta: శర్మిష్ట పనోలికి మధ్యంత బెయిల్ మంజూరు చేసిన కోల్‌కతా హైకోర్టు

What is a Super-Earth?: కెప్లర్-725c అనే కొత్త సూపర్ ఎర్త్‌ను కనుగొన్న చైనా!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

తర్వాతి కథనం
Show comments