అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

సిహెచ్
సోమవారం, 31 మార్చి 2025 (13:39 IST)
క్రెడిట్: ఫ్రీపిక్
ఈమధ్యకాలంలో పంటలను రకరకాల ఫంగస్ పట్టుకుంటుంది. వీటి బారిన పడిన పంటలను పొరబాటున తింటే ప్రాణాంతకమైన కేన్సర్ వ్యాధి సోకే ప్రమాదం వుందని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ముఖ్యంగా మనం నిత్యం వాడే ఎండుమిరప కాయలు, వేరుశనక్కాయలు, మొక్కజొన్న వంటి ప్రధానమైన పంటలు వున్నాయి. అఫ్లాటాక్సిన్ అనే ఒక రకమైన ఫంగస్ ఎండుమిర్చి, వేరుశనగ, మొక్కజొన్న పంటలను ఆశిస్తున్నట్లు కనుగొన్నారు. 
 
ఈ ఫంగస్ సోకిన ఎండుమిర్చి చూసేందుకు నల్లటి మచ్చలు లేదా పసుపు రంగులో గుల్లబారినట్లు అగుపిస్తాయి. ఎండుమిరప కాయలు అలాంటివి కనబడితే వాటిని కొనకుండా వుండటమే మంచిది. ఎందుకంటే అలా మచ్చలు, పసుపు రంగులో వున్న కాయలపై ఈ ఫంగస్ పట్టుకుని వుంటుంది. మనం వాటిని కూరల్లో వేసుకున్నప్పుడు ఈ ఫంగస్ కాస్తా మన జీర్ణాశయానికి చేరుతుంది.
 
ఫలితంగా జీర్ణ సమస్యలతో పాటు కాలేయ కేన్సర్ వచ్చే ప్రమాదం వుందని చెబుతున్నారు. అదేవిధంగా వేరుశనక్కాయలు కొనుగోలు చేసేటపుడు కూడా జాగ్రత్త వహించాలి. నల్ల మచ్చలు, పసుపు మచ్చలతో వున్నటువంటి కాయల జోలికి వెళ్లకుండా వాటిని దూరం పెట్టాలి. ఐతే బాగా ఎండబెట్టడం, వేయించడం వంటి పద్ధతుల ద్వారా ఈ ఫంగస్ కాస్త తగ్గే అవకాశం వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

జూబ్లీ హిల్స్ బైపోల్.. హస్తం హవా.. కారుకు బ్రేక్

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఫలితాలు.. కేసీఆర్ ఏమన్నారంటే?

25 ఏళ్ల జానపద గాయని మైథిలీ ఠాకూర్ చేతిలో ఓడిపోతున్న ఉద్ధండ నాయకుడు బినోద్ మిశ్రా

పరకామణి చోరీ కేసు : ఫిర్యాదు చేసిన ఏవీఎస్వో అనుమానాస్పద మృతి

గ్యాంగ్ రేప్ చేసి బయటే తిరుగుతున్నాడు.. యువతి ఆవేదన (వీడియో)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: అఖండ 2 కోసం ముంబై చేరిన బాలకృష్ణ, బోయపాటిశ్రీను

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

తర్వాతి కథనం
Show comments