Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్యోగులకు తీపి కబురు... రూ.7 లక్షల వరకు నో ట్యాక్స్

Webdunia
బుధవారం, 1 ఫిబ్రవరి 2023 (13:02 IST)
ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఏడు లక్షల వరకు ఆదాయం కలిగిన ఉద్యోగులు ఇకపై ఎలాంటి పన్ను చెల్లించనక్కర్లేదు. ఈ మేరకు బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన 2023-24 వార్షిక బడ్జెట్‌లో విత్తమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
 
అన్ని మినహాయింపులతో కూడుకుని రూ.7 లక్షల లోపు వార్షికాదాయం ఉన్నవారికి ఊరట కలిగిస్తూ, ఆదాయ పన్ను రిబేటును విస్తరిస్తున్నట్టు తెలిపారు. తద్వారా ఆదాయ పన్ను పరిమితిని రూ.7 లక్షలకు పెంచుతున్నట్టు తెలిపారు. అయితే ఇది నూతన ఆదాయ పన్ను విధానాన్ని ఎంచుకున్న వారికి మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు.
 
ఇక వ్యక్తిగత ఆదాయ పన్ను రేట్ల గురించి వివరించారు. స్టాండర్డ్ డిడక్షన్ రూ.2.50 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచారు. రూ.3 లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్ను లేదని తెలిపారు. 
 
రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు 5 శాతం పన్ను ఉంటుందని... రూ.6 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు 10 శాతం పన్ను ఉంటుందని వివరించారు. 
 
రూ.9 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు 15 శాతం పన్ను.... రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు 20 శాతం పన్ను... రూ.15 లక్షలు దాటితే 30 శాతం పన్ను ఉంటుందని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

Megastar Chiranjeevi: సినీ కార్మికుల సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ల కాంత నుంచి ఫస్ట్ సింగిల్

ఆది పినిశెట్టి, చైతన్య రావు నటించిన ఓటీటీ స్ట్రీమింగ్ మయసభ రివ్యూ

Vadde naveen: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు గా వడ్డే నవీన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments