అప్పులు తెచ్చి వడ్డీలు చెల్లిస్తున్న ప్రధాని మోడీ సర్కారు

Webdunia
గురువారం, 2 ఫిబ్రవరి 2023 (07:33 IST)
కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా, ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత చేసిన అప్పులే ఎక్కువగా ఉన్నాయి. ఈ అప్పులకు వడ్డీలు చెల్లించేందుకు కేంద్రం మరో అప్పును చేస్తుంది. ఫలితంగా కేంద్రం చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించేందుకు అప్పులు చేయాల్సిన నిర్బంధ పరిస్థితి నెలకొంది.
 
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం లోక్‌సభలో రూ.45 లక్షల కోట్ల భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో సొంత ఆదాయం వాటా మూడింట రెండు వంతులు కూడా లేదు. అంటే సొంత ఆదాయం రూ.26,32,281 కోట్లు మాత్రమే. మిగిలిన మొత్తం రూ.17,86,1816 కోట్లు అప్పే. అది బడ్జెట్ మొత్తంలో మూడో వంతు కన్నా ఎక్కువగా ఉంది. ఖర్చులోనూ భారీ మొత్తం అప్పులపై వడ్డీల చెల్లింపులకే తరలిపోతుంది. 
 
గత కొన్నేళ్లుగా కేంద్రం చెల్లిస్తున్న వడ్డీల మొత్తం కూడా క్రమంగా పెరుగుతూ వస్తుంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.8.05 లక్షల కోట్లు చెల్లించగా అది 2022-23 నాటికి ఈ మొత్తం రూ.9.40 లక్షల కోట్లకు చేరింది. వచ్చే అర్థిక సంవత్సరానికి ఇది రూ.10.79 లక్షల కోట్లకు చేరుకోవచ్చు. మొత్తం వ్యయంలో ఇది నాలుగో వంతు వరకు ఉంటుంది ఇప్పటివరకు కేంద్రం చేసిన అప్పులు గత యేడాది సెప్టెంబరు నెలాఖరు నాటికి రూ.147 లక్షల కోట్లకు చేరాయి. అందులే విదేశీ అప్పుల వాటాయే రూ.50 లక్షల కోట్లుగా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments