Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిటన్‌కు రైట్ రైట్... యూఏఈ పొడగించిన నిషేధం

Webdunia
శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (12:26 IST)
భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి తారాస్థాయిలో ఉంది. ప్రతి రోజూ 3.80 లక్షల పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వేలాది మంది మృత్యువాతపడుతున్నారు. ఈ క్రమంలో భారత విమాన రాకపోకలపై అనేక దేశాలు నిషేధం విధించాయి. ఇలాంటి దేశాల్లో బ్రిటన్ కూడా ఒకటి. 
 
ఇక్కడ ప్రతిరోజూ నమోదయ్యే కరోనా కేసులు రికార్డులు తిరగరాస్తుండటంతో ఏప్రిల్ 24 యూకేకు విమానాలను రద్దు చేశారు. అయితే మే 1 శనివారం నుంచి ఈ దేశానికి విమాన సర్వీసులను పాక్షికంగా పునరుద్ధరించనున్నట్లు ఎయిరిండియా తెలిపింది. 
 
ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరు నుంచి యూకేలోని హెత్‌రో విమానాశ్రయానికి ఈ విమానాలు ప్రయాణిస్తాయి. మే 1 నుంచి 15 వరకూ ఇలా పాక్షిక సేవలు అందించిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఎయిరిండియా ట్విట్టర్ వేదికగా తెలిపింది.
 
మరోవైపు, భారత్‌లో కొనసాగుతున్న కరోనా ఉధృతి కారణంగా ఇండియన్ ప్రయాణికులపై యూఏఈ నిషేధాన్ని పొడిగించింది. మే 14 వరకు భారత ప్రయాణికులకు యూఏఈలో ప్రవేశం లేదని అక్కడి ట్రావెల్ ఏజెంట్ల ద్వారా తెలిసింది. ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ ఈ మేరకు ట్రావెల్ ఏజెంట్లకు సమాచారం అందించింది. 
 
కాగా, ఇక ఈ నెల 24 నుంచి భారత విమానాల రాకపోకలపై యూఏఈ పూర్తిగా నిషేధం విధించిన విషయం తెలిసిందే. 10 రోజుల పాటు భారత్ నుంచి యూఏఈ వచ్చే అన్నీ విమానాలను క్యాన్సిల్ చేసింది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments