మధుమేహాన్ని నివారించే పనీరుతో కట్ లెట్ ఎలా?

ముందుగా పనీరును తురుముకోవాలి. ఆలును ఉడికించి స్మాష్ చేసుకోవాలి. ఓ పాన్ తీసుకుని అందులో పనీరు తురుము, ఉల్లి తరుగు, కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి తరుగు, ఆలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, పసుపు

Webdunia
మంగళవారం, 5 సెప్టెంబరు 2017 (14:26 IST)
పనీర్‌లో ప్రోటీన్లు పుష్కలంగా వున్నాయి. ఇవి కండరాలకు ఎంతో మేలు చేస్తుంది. మధుమేహాన్ని నివారించే పనీరును వారానికి రెండుసార్లు ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. పనీరు పిల్లల్లో ఎముకల పెరుగుదలకు ఉపకరిస్తుంది. బరువు తగ్గించడంలో మెరుగ్గా పనిచేస్తుంది. కేశాలకు, చర్మ సౌందర్యానికి ఇదెంతో మేలు చేస్తుంది. అలాంటి పనీరుతో గ్రేవీలు చేసి బోర్ కొట్టేసిందా? అయితే వెరైటీగా కట్ లెట్ ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు : 
పనీర్ - పావు కేజీ 
ఆలు - రెండు 
ఉల్లి తరుగు- అరకప్పు 
పచ్చిమిర్చి తరుగు- రెండు స్పూన్లు 
కొత్తిమీర తరుగు - పావు కప్పు 
బ్రెడ్ పొడి - ఒక కప్పు 
అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒకటిన్నర టీ స్పూన్ 
మిరియాల పొడి - ఒక టేబుల్ స్పూన్ 
ఉప్పు, నూనె- తగినంత
 
తయారీ విధానం : 
ముందుగా పనీరును తురుముకోవాలి. ఆలును ఉడికించి స్మాష్ చేసుకోవాలి. ఓ పాన్ తీసుకుని అందులో పనీరు తురుము, ఉల్లి తరుగు, కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి తరుగు, ఆలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, పసుపు పొడి, ఉప్పు చేర్చుకుని బాగా కలుపుకోవాలి.

ఈ మిశ్రమాన్ని కట్ లెట్ షేప్‌లో సిద్ధం చేసుకుని బ్రెడ్ పొడిలో ముంచి ప్లేటులోకి తీసుకోవాలి. స్టౌ మీద బాణలి పెట్టి వేడయ్యాక అందులో నూనె పోసుకోవాలి. నూనె వేడయ్యాక అందులో కట్‌లెట్లను వేసి ఇరువైపులా దోరగా వేయించి సర్వ్ ప్లేటులోకి తీసుకోవాలి. టమోటా సాస్‌తో వీటిని నంజుకుని తింటే టేస్ట్ అదిరిపోతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అజిత్ పవార్ దుర్మరణంపై ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ దిగ్భ్రాంతి

ఫేక్ వీడియోల వెనుక ఎవరున్నా కూడా న్యాయ పోరాటం చేస్తాను.. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అంతర్జాతీయ గుర్తింపు

Ajit Pawar: విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం (video)

జనసేన సిట్టింగ్ ఎమ్మెల్యేపై ఆరోపణలు.. పవన్ కల్యాణ్‌ సస్పెండ్ చేస్తారా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rani Mukerji: రాణీ ముఖ‌ర్జీ 30 ఏళ్ల ఐకానిక్ సినీ లెగ‌సీని సెల‌బ్రేషన్స్

Santosh Shobhan: కపుల్ ఫ్రెండ్లీ నుంచి కాలమే తన్నెరా లక్ ని ఆమడ దూరం.. సాంగ్

ఓ వ్యక్తితో రిలేషన్‌లో ఉన్నా.. కానీ కొన్నాళ్ళకే అసలు విషయం తెలిసింది.. : తమన్నా

15 రోజుల్లో ₹358 కోట్లకు పైగా వసూలు చేసిన మన శంకరవరప్రసాద్ గారు

ఆ బాలీవుడ్ హీరోయిన్ నా లక్కీ ఛార్మ్ : కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ

తర్వాతి కథనం
Show comments