నూడుల్స్‌ సమోసా ఎలా చేయాలో చూద్దాం...

కావలసిన పదార్థాలు: మైదాపిండి - పావుకిలో వాము - 1/5 స్పూన్ ఉప్పు - తగినంత నూనె - సరిపడా నీళ్లు - తగినన్ని అల్లంవెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్ బీన్స్‌ ముక్కలు - 2 స్పూన్స్ క్యారెట్ ముక్కలు - 2 స్పూన్స్ క్

Webdunia
సోమవారం, 13 ఆగస్టు 2018 (13:02 IST)
కావలసిన పదార్థాలు:
మైదాపిండి - పావుకిలో
వాము - 1/5 స్పూన్
ఉప్పు - తగినంత
నూనె - సరిపడా
నీళ్లు - తగినన్ని
అల్లంవెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్
బీన్స్‌ ముక్కలు - 2 స్పూన్స్
క్యారెట్ ముక్కలు - 2 స్పూన్స్
క్యాబేజీ తురుము - పావుకప్పు
క్యాప్సికమ్ ముక్కలు - 1 స్పూన్
రెడ్‌చిల్లీ సాస్ - 1 స్పూన్
సోయాసాస్ - 2 స్పూన్స్
ఉల్లికాడల తురుము - 2 స్పూన్స్
మెుక్కజొన్న పిండి - 1 స్పూన్
నూడుల్స్ - 2 కప్పులు(ఉడికించినవి)
 
తయారీ విధానం: 
ముందుగా బాణలిలో స్పూన్ నూనెను వేసి కాగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకుని తరువాత చిటికెడు ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు బీన్స్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, క్యాబేజీ తురుము, క్యాప్సికమ్ ముక్కలు, రెడ్‌చిల్లీసాస్, సోయాసాస్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ తరువాత ఉల్లికాడల తురుము కూడా వేసుకుని వేగనివ్వాలి. చివరగా మెున్నజొన్న పిండిని చల్లుకుని ఉండికించిన నూడుల్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ప్లేట్‌లో వేసుకుని ఆరనివ్వాలి. 
 
ఒక గిన్నెలో మైదాపిండి, వాము, ఉప్పు, కొద్దిగా నూనెను వేసుకుని కలుపుకోవాలి. తరువాత కొద్ది కొద్దిగా నీళ్లను వేసుకుంటూ ముద్దలా తయారుచేసుకోవాలి. ఇప్పుడు ఆ పిండిని చిన్న ముద్దల్లా చేసుకుని పూరీల్లా వత్తాలి. దీన్ని సగానికి కోసి ఒక్కో త్రికోణాకారంలో చుట్టి అందులో నూడుల్స్ మిశ్రమాన్ని పెట్టుకుని అతికించాలి. ఆ తరువాత నూనెను వేయించి తీసుకుంటే వేడివేడి నూడుల్స్ సమోసా రెడీ. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

AI Impact Summit 2026, ఢిల్లీ లగ్జరీ హోటల్‌లో ఒక్కరోజుకి రూ. 25 లక్షలు

ఇద్దరు అనాథ పిల్లలకు తన జీతం నుంచి నెలకి రూ. 10,000 డిప్యూటీ సీఎం పవన్ సాయం

మానసికస్థితి సరిగాలేని టెక్కీ రైలు పట్టాలపై పడుకున్నాడు.. తల మొండెం వేరయ్యాయి...

ప్లీజ్.. మాకు ఇంకో వందే భారత్ రైలును కేటాయించరూ... రైల్వే మంత్రికి సీఎం బాబు వినతి

కాంగ్రెస్ నేతలపై రూ.500 కోట్ల పరువునష్టం దావా వేసిన అస్సాం సీఎం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Yash: యశ్ టాక్సిక్ చిత్రానికి హిస్టారికల్ ఓవర్సీస్ డీల్ కుదుర్చుకున్న ఫార్స్ ఫిల్మ్

రజనీకాంత్ చిత్ర నిర్మాతకు మద్రాస్ హైకోర్టు స్ట్రాంగ్ వార్నింగ్

Santosh Shobhan: కపుల్ ఫ్రెండ్లీ ఒక ప్యూర్ లవ్ స్టోరీ : ధీరజ్ మొగిలినేని

Tanikella Bharani: శివ భక్తితో లీనమై శివోహం పాటలో నటించా : తనికెళ్ల భరణి

జీవితంలో అందరికీ కనెక్ట్ అయ్యే సీన్స్ ఫంకీ లో ఉంటాయి : కె.వి. అనుదీప్

తర్వాతి కథనం
Show comments