Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంజారాహిల్స్‌ స్టోర్‌ వద్ద అక్టోబర్‌ 14-15 తేదీలలో ప్యూర్‌ ఫాసెట్స్‌ ప్రత్యేక ప్రదర్శన

Webdunia
బుధవారం, 12 అక్టోబరు 2022 (16:14 IST)
హైదరాబాద్‌లో సుప్రసిద్ధ జ్యువెలరీ ఔట్‌లెట్‌లలో ఒకటైన ప్యూర్‌ ఫాసెట్స్‌, ఈ సీజన్‌ కోసం తమ ప్రీ దివాలీ ఎగ్జిబిషన్‌లో భాగంగా నగర ప్రజల కోసం ప్రత్యేకంగా ఎంపిక చేసిన కలెక్షన్‌, వినూత్నమైన కళాత్మక ఆభరణాలతో ఓ ప్రదర్శన చేయనుంది. వీటిని ప్యూర్‌ ఫాసెట్స్‌ స్టోర్‌, ప్లాట్‌ నెంబర్‌ 15, రోడ్‌ నెంబర్‌ 10, సబ్యసాచి షోరూమ్‌ పక్కన, బంజారాహిల్స్‌, హైదరాబాద్‌ వద్ద అక్టోబర్‌ 14-15 తేదీలలో ప్రదర్శించనున్నారు.
 
గత మూడు తరాలుగా యూరోప్‌, యుఎస్‌ఏ, మిడిల్‌ ఈస్ట్‌ మార్కెట్‌లకు వజ్రాలు, ఫైన్‌ జ్యువెలరీ ఎగుమతి చేసే వ్యాపారంలో ప్యూర్‌ ఫాసెట్స్‌ ఎల్‌ఎల్‌పీ ఉంది. వీరు గతంలో సుప్రసిద్ధ జ్యువెలరీ డిజైనర్‌ శ్రీమతి శోభా అసర్‌తో భాగస్వామ్యం చేసుకున్నారు. 2017లో రిటైల్‌ జ్యువెలరీ అవార్డులు వద్ద సున్నితమైన బొటిక్‌ ఫైన్‌ జ్యువెలరీ రిటైలింగ్‌లో బెస్ట్‌ డిజైన్‌ మొదలు బెస్ట్‌ రిటైలర్‌ వరకూ ఆరు విభాగాలలో అవార్డులను ఆమె అందుకున్నారు. నేడు, ప్యూర్‌ ఫాసెట్స్‌ తమ వినియోగదారుల అవసరాలను తమ సొంత బ్రాండ్‌ ప్యూర్‌ ఫాసెట్స్‌ ఎల్‌ఎల్‌పీ ద్వారా అందుకోవడం కొనసాగిస్తోంది.
 
ప్యూర్‌ ఫాసెట్స్‌ ఎల్‌ఎల్‌పీ యజమాని శ్రీమతి పవిత్ర గాంధి, లగ్జరీ లైఫ్‌స్టైల్‌ వీకెండ్‌ కింద 150కు పైగా టాప్‌ గ్లోబల్‌ రిటైల్‌ బ్రాండ్లతో భాగస్వామ్యం చేసుకున్నారు. ఈ భాగస్వామ్యంతో, ఆమె తన జ్యువెలరీ వెంచర్‌కు సంబంధించి ప్రతి ఒక్కరి దృష్టినీ ఆకర్షించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఖాతాదారుల అవసరాలను తీర్చడంలోనూ ఇది ఆమెకు సహాయపడింది. భారతదేశంలో అగ్రగామి ఆభరణాల బ్రాండ్‌లతో భాగస్వామ్యం చేసుకోవడం వల్ల ఈ ప్రాంతం, సంస్కృతి, ఆభరణాల డిజైనింగ్‌, రిటైలింగ్‌ పరంగా సంప్రదాయాల పట్ల పూర్తి అవగాహన శ్రీమతి గాంధీకి లభించింది.
 
రాబోతున్న ఎగ్జిబిషన్‌ గురించి ఆమె మాట్లాడుతూ, ‘‘ భౌతికంగా షాప్‌లకు వెళ్లడం, నూతన, రాబోతున్న ధోరణులను వ్యక్తిగతంగా పరిశీలించడం ఇప్పుడు మరీ ముఖ్యంగా కొవిడ్‌ మహమ్మారి అనంతర కాలంలో బాగా పెరిగింది. లాయల్‌ కస్టమర్లుతో అనుబంధం మరింత బలోపేతం చేసుకోవడానికి, నూతన వినియోగదారులను కలుసుకోవడానికి అత్యుత్తమ మార్గంగా ఎగ్జిబిషన్‌లు నిలుస్తాయి’’ అని అన్నారు.
 
సెలబ్రిటీ డిజైనర్లు, బ్రాండ్లతో ప్యూర్‌ ఫాసెట్స్‌ భాగస్వామ్యం చేసుకోవడంతో పాటుగా గతంలో ఎన్నడూ చూడని వినూత్న అనుభవాలు, ఉత్పత్తులను సృష్టిస్తుంది. దీనికోసం, అంతర్జాతీయ బ్రాండ్లకు చెందిన  అగ్రగామి ప్రొడక్షన్‌ మేనేజర్లను నియమించుకుని రంగులు, శైలిలు, డిజైన్లు పరంగా తాజా ధోరణులను దృష్టిలో పెట్టుకుని ఫైన్‌ ట్రెడిషనల్‌ జ్యువెలరీని ఎంపిక చేసి, యువతరానికి అందుబాటు ధరలలో విలాసాన్ని అందిస్తుంది.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments