Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భార్య పుట్టింటికి వెళ్ళింది... ఏకాకినయ్యా.. అందుకే చనిపోతున్నా...

suicide
, బుధవారం, 12 అక్టోబరు 2022 (10:38 IST)
ఓ ఆటో డ్రైవర్ పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బలవన్మరణానికి పాల్పడేముందు ఆయన సెల్ఫీ వీడియో తీశాడు. ఇందులో తాను చేసిన తప్పును తెలుసుకున్నాడు. కుటుంబ సభ్యులను బాధపెట్టినట్టు బోరున విలపించాడు. తాను తప్పు చేశానని, అందుకే చనిపోతున్నట్టు ఆ వీడియోలో పేర్కొన్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హైదరాబాద్ నగరం చౌదరి గూడకు చెందిన కె.నరసింహ - లక్ష్మమ్మ దంపతులు దినసరి కూలీలు. వీరి కుమారుడు రవి (35) ఆటోడ్రైవర్‌. పదేళ్ల క్రితం వివాహమైంది. మద్యానికి బానిసకావడంతో మనస్పర్థల కారణంగా భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. జీవితంపై విరక్తి చెందిన రవి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడికి ఎనిమిదేళ్లలోపు కుమార్తె, కుమారుడు ఉన్నారు.
 
ఆయన పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముందుగా ఓ సెల్ఫీ వీడియో తీశాడు. అందులో "మద్యానికి బానిసయ్యాను. నా ప్రవర్తనలో మార్పు వస్తుందని నా భార్య పదేళ్లు నాతో కాపురం చేసింది. నాలో మార్పు రాకపోవడంతో.. పుట్టింటికి వెళ్లిపోయింది. ఏకాకినయ్యా. తప్పంతా నాదే. అందుకే చనిపోతున్నా" అంటూ పురుగు మందు తాగాడు. ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. శంషాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్ పారిశ్రామికవేత్త హత్య కేసు - ముద్దాయిలకు జీవితఖైదు